సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో ఆబ్కారీ అధికారులు దాడులు జరిపి... ఓ కిరాణా దుకాణంలో విక్రయిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సాయికుమార్ గౌడ్ అనే వ్యక్తి తన కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామని ఎస్సై వెంకటేశ్ అన్నారు.
ఈ దాడుల్లో 250 మద్యం సీసాలను స్వాధీనం చేసినట్లు తెలిపారు. కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వఉంచి విక్రయిస్తున్నందున సాయికుమార్ గౌడ్ పై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఆబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కూకట్పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్