ETV Bharat / crime

వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఇళ్లలో ఐటీ దాడులు

IT RAIDS AT YCP LEADERS HOUSES: తెలుగు రాష్ట్రాలలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈరోజు ఏపీలోని వైసీపీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు విజయవాడలో సోదాలు నిర్వహించారు. వైసీపీ నేత అవినాష్​ ఇంటిలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

author img

By

Published : Dec 6, 2022, 3:25 PM IST

Updated : Dec 6, 2022, 4:11 PM IST

IT RAIDS AT YCP LEADERS HOUSES
IT RAIDS AT YCP LEADERS HOUSES

IT RAIDS AT YCP LEADERS HOUSES: ఆంధ్రప్రదేశ్​లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఈ రోజు విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినాష్‌ ఇంట్లో ఉదయం 6.30 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వంశీరామ్‌ బిల్డర్స్‌ యజమాని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌, విజయవాడతో పాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కి పైగా బృందాలు పాల్గొంటున్నాయి.

IT RAIDS AT YCP LEADERS HOUSES: ఆంధ్రప్రదేశ్​లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఈ రోజు విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినాష్‌ ఇంట్లో ఉదయం 6.30 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వంశీరామ్‌ బిల్డర్స్‌ యజమాని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌, విజయవాడతో పాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కి పైగా బృందాలు పాల్గొంటున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 6, 2022, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.