ETV Bharat / crime

MURDER: కోడలితో వివాహేతర సంబంధం.. కుమారుడిని చంపిన తండ్రి!

మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి అనడానికి ఈ ఘటనే ఓ ఉదహరణ. కోడలి కోసం కుమారుడిని హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. కోడలితోనే వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి.. కన్న కొడుకునే హత్య చేశాడు. అర్ధరాత్రి దాటాకా మారణాయుధాలతో అతికిరాతంగా చంపేశాడు.

author img

By

Published : Aug 3, 2021, 10:57 AM IST

father murder his son, andhra pradesh murder
కుమారుడిని చంపిన తండ్రి, కొడుకును చంపిన తండ్రి

సమాజంలో బంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు మరిచి ప్రవర్తించడమేగాకుండా... స్వల్పకాల సుఖాల కోసం ప్రాణాలను సైతం తీస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డలైనా... కన్నవాళ్లనైనా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

కోడలితో వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించాడా తండ్రి. ఆమెతో కలిసి కుమారుడిని హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్య, మరియమ్మ భార్యాభర్తలు. వీరి కుమారుడు లక్ష్మయ్య (35)కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతకు పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. మరియమ్మ ముప్పై ఏళ్ల క్రితమే చనిపోయారు. లక్ష్మయ్య మద్యానికి బానిసై ఆ మత్తులో ఉండేవాడు. ఈ క్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని అద్దంకి సీఐ రాజేష్‌, ఎస్సై వి.శివన్నారాయణ తెలిపారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారని పేర్కొన్నారు.

అనుకున్న పథకం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక.. గాఢనిద్రలో ఉన్న లక్ష్మయ్యపై మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఈ దారుణం మృతుడి పెద్ద కుమారుడు చూడడం వల్ల విషయం బహిర్గతమైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: MURDER: ఆస్తి కోసం అత్తామామలనే హతమార్చాడు.. చివరికి..

సమాజంలో బంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు మరిచి ప్రవర్తించడమేగాకుండా... స్వల్పకాల సుఖాల కోసం ప్రాణాలను సైతం తీస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డలైనా... కన్నవాళ్లనైనా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

కోడలితో వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించాడా తండ్రి. ఆమెతో కలిసి కుమారుడిని హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్య, మరియమ్మ భార్యాభర్తలు. వీరి కుమారుడు లక్ష్మయ్య (35)కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతకు పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. మరియమ్మ ముప్పై ఏళ్ల క్రితమే చనిపోయారు. లక్ష్మయ్య మద్యానికి బానిసై ఆ మత్తులో ఉండేవాడు. ఈ క్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని అద్దంకి సీఐ రాజేష్‌, ఎస్సై వి.శివన్నారాయణ తెలిపారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారని పేర్కొన్నారు.

అనుకున్న పథకం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక.. గాఢనిద్రలో ఉన్న లక్ష్మయ్యపై మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఈ దారుణం మృతుడి పెద్ద కుమారుడు చూడడం వల్ల విషయం బహిర్గతమైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: MURDER: ఆస్తి కోసం అత్తామామలనే హతమార్చాడు.. చివరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.