హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad by election) సందర్భంగా నియోజకవర్గ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో హుజురాబాద్ వైపు వచ్చే అన్ని మార్గాల్లోనూ సోదాలు చేపట్టారు (vehicles checking). సోమవారం జమ్మికుంట మోత్కుల గూడెం వద్ద రూ.4 లక్షలు, గాంధీ చౌక్ వద్ద 5 లక్షలు, ఫ్లై ఓవర్ వంతెనపై 1.5 లక్షల నగదును ముగ్గురు వేర్వేరు వ్యక్తులు బైకులపై తీసుకెళ్తుండగా టాస్క్ ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నారు.

అలుగునూరులో రూ. 4.5 లక్షలు స్వాధీనం
కరీంనగర్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా (police checking) ఎలాంటి రసీదులు లేకుండా తీసుకెళ్తున్న రూ.4.5 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఆదాయపు పన్నుశాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మరో వైపు హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన సోదాల్లో ఓ కారులో తీసుకెళ్తున్న చీరలను గుర్తించారు. అవి ఓ వస్త్ర దుకాణానికి సంబంధించినట్లుగా రసీదులు చూపించడంతో విడిచిపెట్టారు. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వాహనాల్లోను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
మంత్రి గంగుల వాహనంలోను సోదాలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా మంత్రి గంగుల కమలాకర్ పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆయన హుజూరాబాద్కు వస్తుండగా.. ఆయన వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేశారు.

పదునెక్కిన ప్రచారం
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రచారం (Huzurabad By Election Campaign) ఊపందుకుంది. అందరి బాధలు తీర్చే ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్లను ఆర్థిక మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) కోరారు. సామాన్యులపై ధరల భారాన్ని మోపుతున్న భాజపాకు తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్ కోరారు.
అంతిమ విజయం ధర్మానిదే...
మరోవైపు హుజురాబాద్లో భాజపా ప్రచారం ఊపందుకుంది. ఆపార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన రాజీనామాతోనే పడకేసిన పథకాలను పరుగులు పెట్టించి అమలుచేస్తున్నారని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని డబ్బుల సంచులతో ఏమార్చాలని చూస్తున్నారని, అంతిమ విజయం ధర్మానిదేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. హుజూరాబాద్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు.
ఇదీ చూడండి: Minister KTR at Council: 'కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యే'