ETV Bharat / crime

LIVE VIDEO: పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ వేపై కారు దగ్ధం.. - car burnt on pv way news

రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్​ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు దగ్ధమైంది. మామిడిపల్లి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తుండగా 130 నంబరు పిల్లర్​ వద్ద కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న తల్లి, రెండు నెలల కూతురు, ఇద్దరు కుమారులను తోటి ప్రయాణికులు రక్షించారు.

car burnt on pv highway
పీవీ హైవేపై కారు దగ్ధం
author img

By

Published : Jul 12, 2021, 7:15 PM IST

హైదరాబాద్​ రాజేంద్రనగర్​ పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్ వేపై​ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మామిడిపల్లి నుంచి పీవీ వే మీదుగా బంజారాహిల్స్​ వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. గమనించిన తోటి ప్రయాణికులు.. కారులో ప్రయాణిస్తున్న తల్లి, 2 నెలల కూతురు, ఇద్దరు కుమారులను సురక్షితంగా బయటకు తీశారు.

మామిడిపల్లికి చెందిన శైలజ.. బంజారాహిల్స్​లోని ఓ ప్రైవేటు​ ఆస్పత్రికి వెళ్తుండగా అత్తాపూర్​ 135 నంబరు పిల్లర్​ వద్దకు రాగానే అకస్మాత్తుగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. కారులో మహిళతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఇరుక్కుపోయారు. అదే దారిలో వెళ్తున్న రవి అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్​ పోలీసులు ఫైర్​ ఇంజిన్​ సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో హైవేపై కారులో వెళ్తున్న గవర్నర్​ తమిళిసై సౌందర్​ రాజన్​.. సంఘటనను పరిశీలించారు.

శైలజ, వారి పిల్లలను రాజేంద్రనగర్ పోలీసులు సురక్షితంగా ఇంటికి పంపించారు. వారిని కాపాడిన రవిని ఏసీపీ సంజయ్ కుమార్, స్థానికులు ప్రశంసించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ వేపై కారు దగ్ధం

ఇదీ చదవండి: బుక్కెడు బువ్వ పెట్టమన్నందుకు.. బతికుండగానే బొంద తీశాడు.!

హైదరాబాద్​ రాజేంద్రనగర్​ పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్ వేపై​ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మామిడిపల్లి నుంచి పీవీ వే మీదుగా బంజారాహిల్స్​ వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. గమనించిన తోటి ప్రయాణికులు.. కారులో ప్రయాణిస్తున్న తల్లి, 2 నెలల కూతురు, ఇద్దరు కుమారులను సురక్షితంగా బయటకు తీశారు.

మామిడిపల్లికి చెందిన శైలజ.. బంజారాహిల్స్​లోని ఓ ప్రైవేటు​ ఆస్పత్రికి వెళ్తుండగా అత్తాపూర్​ 135 నంబరు పిల్లర్​ వద్దకు రాగానే అకస్మాత్తుగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. కారులో మహిళతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఇరుక్కుపోయారు. అదే దారిలో వెళ్తున్న రవి అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్​ పోలీసులు ఫైర్​ ఇంజిన్​ సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో హైవేపై కారులో వెళ్తున్న గవర్నర్​ తమిళిసై సౌందర్​ రాజన్​.. సంఘటనను పరిశీలించారు.

శైలజ, వారి పిల్లలను రాజేంద్రనగర్ పోలీసులు సురక్షితంగా ఇంటికి పంపించారు. వారిని కాపాడిన రవిని ఏసీపీ సంజయ్ కుమార్, స్థానికులు ప్రశంసించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ వేపై కారు దగ్ధం

ఇదీ చదవండి: బుక్కెడు బువ్వ పెట్టమన్నందుకు.. బతికుండగానే బొంద తీశాడు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.