హోలీ పండుగ వేళ.. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లో విషాదం నెలకొంది. మిథిలా నగర్లో.. పండుగ సంబురాల్లో రంగులు చల్లుకున్న అనంతరం, ఐదుగురు బాలురు స్నానానికని స్థానిక క్వారీకి వెళ్లారు. పదో తరగతి చదువుతున్న కౌశిక్ శ్రీ సాయి(15) ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు.
తోటివారి సమాచారంతో.. బాధితుడి తల్లిదండ్రులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఆర్ఎఫ్ టీమ్తో.. క్వారీలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే సమయానికి బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇవాళ ఉదయం మృతదేహం లభ్యం లభ్యమైంది.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: బైక్ను తప్పించబోయి లారీలు ఢీ