ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గొల్ల కంచలి గ్రామంలో నాటు బాంబులు లభించాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో 40 నాటు బాంబులు బయట పడ్డాయి. ఇటీవలే గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆధిపత్యం కోసం ఓ వర్గం వారు వీటిని ఒరిస్సా నుంచి తెప్పించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటన విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామి రెడ్డి తెలిపారు. అడవి పందులను చంపడానికి.. వీటిని వినియోగిస్తున్నట్లు పలువురు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని కంచలి పోలీసులు పరిశీలించారు.