నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మహబూబ్నగర్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలో ఇద్దరు వ్యాపారుల నుంచి 830కిలోల నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. నాటు సారా తయారీ కోసం ఉపయోగించే బెల్లం, 80కిలోల పటికను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నాటుసారా కోసం నల్లబెల్లం విక్రయించడం చట్టరీత్యా నేరమని ఎన్ఫోర్స్మెంట్ సీఐ గణపతి రెడ్డి తెలిపారు. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఈతకెళ్లి క్వారీ నీటిలో చిక్కుకొని.. బాలుడు మృతి