ETV Bharat / crime

నిచ్చెన, కట్టెల వివాదం... తెరాస, కాంగ్రెస్ నాయకుల దాడులు

సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామంలో తెరాస, కాంగ్రెస్ నాయకులు దాడులు చేసుకున్నారు. ఆ దాడుల దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు రామచంద్రాపురం పోలీసులు తెలిపారు.

author img

By

Published : Mar 9, 2021, 1:55 PM IST

assault-between-congress-and-trs-leaders-at-kollapur-in-sangareddy-district
నిచ్చెన, కట్టెల వివాదం... తెరాస, కాంగ్రెస్ నాయకుల దాడులు
నిచ్చెన, కట్టెల వివాదం... తెరాస, కాంగ్రెస్ నాయకుల దాడులు

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్వ మున్సిపల్ పరిధి కొల్లూరు గ్రామంలో తెరాస, కాంగ్రెస్ నాయకులు దాడులు చేసుకున్నారు. తెరాస నాయకుడు నరసింహ, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నరసింహ, ఆయన భార్య మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ జయలక్ష్మి దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

నిచ్చెన, కట్టెల విషయంలో ఇరు పార్టీల నాయకులు దాడులు చేసుకున్నారని రామచంద్రాపురం పోలీసులు తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం

నిచ్చెన, కట్టెల వివాదం... తెరాస, కాంగ్రెస్ నాయకుల దాడులు

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్వ మున్సిపల్ పరిధి కొల్లూరు గ్రామంలో తెరాస, కాంగ్రెస్ నాయకులు దాడులు చేసుకున్నారు. తెరాస నాయకుడు నరసింహ, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నరసింహ, ఆయన భార్య మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ జయలక్ష్మి దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

నిచ్చెన, కట్టెల విషయంలో ఇరు పార్టీల నాయకులు దాడులు చేసుకున్నారని రామచంద్రాపురం పోలీసులు తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.