ETV Bharat / crime

FAKE NEWS ON TTD: సోషల్​ మీడియాలో తితిదే, ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం..! - తెలంగాణ వార్తలు

సామాజిక మాధ్యమాల్లో తితిదే, ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న 18 మందిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారికి చెందిన 1500 కిలోల బంగారు నగలు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టు పెట్టి ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే విజిలెన్స్‌ అధికారులు గురువారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

fake news on ap government, fake news on ttd
ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం, తితిదేపై ఫేక్ న్యూస్
author img

By

Published : Aug 14, 2021, 4:06 PM IST

తితిదే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి శ్రీవారి 1500 కిలోల బంగారు నగలను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టుపెట్టినట్లు జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా పోస్టులు షేర్ చేశారని 18మందిపై తితిదే విజిలెన్స్‌ అధికారులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తితిదేకు చెందిన బంగారాన్ని ఏపీ ప్రభుత్వం ఎస్‌బీఐలో తాకట్టుపెట్టి అప్పు తెచ్చిందని.. మమ్మల్ని తర్వాత కాపాడుదురు కానీ.. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి స్వామీ.. ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవింద’ అంటూ భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో దుష్ప్రచారం చేశారని విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో పాటు మరో 16 మంది ఈ దుష్ప్రచారం చేశారని అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని అధికారులంటున్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్ట్‌లు పెట్టి షేర్‌ చేయడం మంచిది కాదని తితిదే అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: శ్రావణ శనివారం స్పెషల్.. ఆలయాల్లో భక్తుల కిటకిట

తితిదే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి శ్రీవారి 1500 కిలోల బంగారు నగలను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టుపెట్టినట్లు జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా పోస్టులు షేర్ చేశారని 18మందిపై తితిదే విజిలెన్స్‌ అధికారులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తితిదేకు చెందిన బంగారాన్ని ఏపీ ప్రభుత్వం ఎస్‌బీఐలో తాకట్టుపెట్టి అప్పు తెచ్చిందని.. మమ్మల్ని తర్వాత కాపాడుదురు కానీ.. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి స్వామీ.. ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవింద’ అంటూ భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో దుష్ప్రచారం చేశారని విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో పాటు మరో 16 మంది ఈ దుష్ప్రచారం చేశారని అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని అధికారులంటున్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్ట్‌లు పెట్టి షేర్‌ చేయడం మంచిది కాదని తితిదే అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: శ్రావణ శనివారం స్పెషల్.. ఆలయాల్లో భక్తుల కిటకిట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.