ETV Bharat / crime

గ్రూప్​ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువకుడు ఆత్మహత్య

author img

By

Published : Oct 18, 2022, 1:25 PM IST

Young man commits suicide: గ్రూప్​-1 పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

A young man commits suicide
A young man commits suicide

young man commits suicide: గ్రూప్​ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అల్వాల్​లో నివాసముండే సాకేత్ కుమార్(28) రెెండు రోజుల క్రితం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు హాజరయ్యాడు. అందులో సరిగ్గా రాయలేదని మనస్థాపం చెందాడు. దీంతో నిన్న అతని ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందరూ ఇంట్లో ఉండటంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు.

ఈ రోజు ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సాకేత్​ గౌడవెల్లి ఓఆర్ఆర్ పక్కన పెట్రోల్ పోసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరీక్ష బాగా రాయనందుకే ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

young man commits suicide: గ్రూప్​ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అల్వాల్​లో నివాసముండే సాకేత్ కుమార్(28) రెెండు రోజుల క్రితం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు హాజరయ్యాడు. అందులో సరిగ్గా రాయలేదని మనస్థాపం చెందాడు. దీంతో నిన్న అతని ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందరూ ఇంట్లో ఉండటంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు.

ఈ రోజు ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సాకేత్​ గౌడవెల్లి ఓఆర్ఆర్ పక్కన పెట్రోల్ పోసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరీక్ష బాగా రాయనందుకే ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.