ETV Bharat / crime

ఆన్​లైన్​ బెట్టింగ్​లో నష్టం... వ్యక్తి బలవన్మరణం - మంచిర్యాలలో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం పడ్తన్​పల్లిలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్​లైన్​ జూదం, క్రికెట్​ బెట్టింగ్​లో ఆర్థికంగా నష్టపోయి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆన్​లైన్​ బెట్టింగ్​లో నష్టపోయి... పురుగులమందు తాగి ఆత్మహత్య
ఆన్​లైన్​ బెట్టింగ్​లో నష్టపోయి... పురుగులమందు తాగి ఆత్మహత్య
author img

By

Published : Jan 27, 2021, 9:27 PM IST

ఆన్​లైన్​లో పేకాట, క్రికెట్​ బెట్టింగ్​లో నష్టపోయిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం పడ్తన్​పల్లిలో జరిగింది.

గ్రామానికి చెందిన పోశెట్టి... ఆన్​లైన్​ బెట్టింగ్​లో ఆర్థికంగా నష్టపోయాడు. గత పది రోజులుగా దిగాలుగా ఉండేవాడని... ఈ క్రమంలో బుధవారం ఇంటికి సమీపంలో క్రిమిసంహారక ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్​లైన్​లో పేకాట, క్రికెట్​ బెట్టింగ్​లో నష్టపోయిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం పడ్తన్​పల్లిలో జరిగింది.

గ్రామానికి చెందిన పోశెట్టి... ఆన్​లైన్​ బెట్టింగ్​లో ఆర్థికంగా నష్టపోయాడు. గత పది రోజులుగా దిగాలుగా ఉండేవాడని... ఈ క్రమంలో బుధవారం ఇంటికి సమీపంలో క్రిమిసంహారక ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మహిళను వేధించిన కేసులో ఓ వ్యక్తి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.