ETV Bharat / crime

ఇలా చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు

author img

By

Published : Aug 8, 2021, 8:31 AM IST

రహదారి ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం ఉండటం లేదు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపి.. ప్రమాదాలకు కారణమయ్యే వాళ్లపై హత్య కేసు నమోదు చేస్తున్నారు.

road accidents
రోడ్డు ప్రమాదాలు

ఈనెల 1వ తేదీన గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ మంగళ అపార్ట్​మెంట్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న అశ్రిత అనే యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణంగా తేల్చారు. స్నార్ట్ పబ్​లో వారు మద్యం సేవించారు. ఆ తర్వాత అభిషేక్ అనే వ్యక్తి వాహనం నడిపాడు. ప్రమాదానికి కారణమైన అతడిని ఏ1గా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పబ్ మేనేజర్ ప్రణేష్, యజమాని సూర్యనాథ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కారులో కూర్చున్న మరో వ్యక్తి సాయి ప్రకాశ్​ను ఏ2 నిందితుడిగా చేర్చారు.

పక్కాగా సెక్షన్​ అమలు

మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదం అవుతుందని తెలిసినా నడిపిన అభిషేక్​పై​, మద్యం సేవించి వాహనం నడిపినా అభ్యంతరం చెప్పకుండా కూర్చున్నందుకు సాయి ప్రకాశ్​పై, వారికి మద్యం విక్రయించిన పబ్ మేనేజర్, యజమానిపై 304 పార్ట్ 2 సెక్షన్ నమోదు చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పోలిస్తే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సెక్షన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో లక్షా యాభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 16,866 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,821 మంది మృతి చెందారు. 16,591 మంది గాయాలపాలయ్యారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాళ్లపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు.

జులై వరకు 111 కేసులు

న్యాయస్థానాలు సైతం ఈ తరహా కేసుల్లో వాహన యజమానులకు జరిమానా విధిస్తుండటంతో పాటు.. ఒకటి నుంచి నెల రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తున్నాయి. అయినా రోజు డ్రంక్ అండ్​ డ్రైవ్​లో వాహనదారులు పట్టుబడుతూనే ఉన్నారు. రహదారి ప్రమాదాల్లో వాహన డ్రైవర్లు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. వాహనదారుల్లో ఎలాగైనా మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో పోలీసులు 304 పార్ట్ 2ను ప్రయోగిస్తున్నారు. ఈ సెక్షన్ వల్ల 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జులై వరకు 111 కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరిలో అత్యధికంగా 22 కేసులు నమోదు కాగా జనవరిలో 21, మార్చిలో 20 కేసులు నమోదు చేశారు. జులైలో కేవలం 5 కేసులే 304 పార్ట్ 2 సెక్షన్ కింద నమోదయ్యాయి. ప్రమాదాల నివారణ కోసం ఓ వైపు అవగాహన కల్పిస్తున్న పోలీసులు... మరోవైపు కఠిన సెక్షన్లు నమోదు చేస్తున్నారు. ఓ వ్యక్తి రహదారి ప్రమాదంలో మరణిస్తే అతనిపై ఆధారపడిన వాళ్లు వీధిన పడిన ఘటనలున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించి రహదారి ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు వాహనదారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి: Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా- భారత్​కు స్వర్ణం

ఈనెల 1వ తేదీన గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ మంగళ అపార్ట్​మెంట్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న అశ్రిత అనే యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణంగా తేల్చారు. స్నార్ట్ పబ్​లో వారు మద్యం సేవించారు. ఆ తర్వాత అభిషేక్ అనే వ్యక్తి వాహనం నడిపాడు. ప్రమాదానికి కారణమైన అతడిని ఏ1గా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పబ్ మేనేజర్ ప్రణేష్, యజమాని సూర్యనాథ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కారులో కూర్చున్న మరో వ్యక్తి సాయి ప్రకాశ్​ను ఏ2 నిందితుడిగా చేర్చారు.

పక్కాగా సెక్షన్​ అమలు

మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదం అవుతుందని తెలిసినా నడిపిన అభిషేక్​పై​, మద్యం సేవించి వాహనం నడిపినా అభ్యంతరం చెప్పకుండా కూర్చున్నందుకు సాయి ప్రకాశ్​పై, వారికి మద్యం విక్రయించిన పబ్ మేనేజర్, యజమానిపై 304 పార్ట్ 2 సెక్షన్ నమోదు చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పోలిస్తే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సెక్షన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో లక్షా యాభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 16,866 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,821 మంది మృతి చెందారు. 16,591 మంది గాయాలపాలయ్యారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాళ్లపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు.

జులై వరకు 111 కేసులు

న్యాయస్థానాలు సైతం ఈ తరహా కేసుల్లో వాహన యజమానులకు జరిమానా విధిస్తుండటంతో పాటు.. ఒకటి నుంచి నెల రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తున్నాయి. అయినా రోజు డ్రంక్ అండ్​ డ్రైవ్​లో వాహనదారులు పట్టుబడుతూనే ఉన్నారు. రహదారి ప్రమాదాల్లో వాహన డ్రైవర్లు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. వాహనదారుల్లో ఎలాగైనా మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో పోలీసులు 304 పార్ట్ 2ను ప్రయోగిస్తున్నారు. ఈ సెక్షన్ వల్ల 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జులై వరకు 111 కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరిలో అత్యధికంగా 22 కేసులు నమోదు కాగా జనవరిలో 21, మార్చిలో 20 కేసులు నమోదు చేశారు. జులైలో కేవలం 5 కేసులే 304 పార్ట్ 2 సెక్షన్ కింద నమోదయ్యాయి. ప్రమాదాల నివారణ కోసం ఓ వైపు అవగాహన కల్పిస్తున్న పోలీసులు... మరోవైపు కఠిన సెక్షన్లు నమోదు చేస్తున్నారు. ఓ వ్యక్తి రహదారి ప్రమాదంలో మరణిస్తే అతనిపై ఆధారపడిన వాళ్లు వీధిన పడిన ఘటనలున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించి రహదారి ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు వాహనదారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి: Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా- భారత్​కు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.