ETV Bharat / city

కొవిడ్ ఆసుపత్రిగా ఎంజీఎం.. చర్యలు తీసుకుంటున్నాం : ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి తాజా సమీక్ష

వరంగల్ ఎంజీఎంలో అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నందున కరోనా బాధితులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కరోనా వ్యాప్తిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిధుల సమస్య లేదని.. వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పరీక్షల కోసం కావాల్సినన్ని ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు ఇవ్వడానికి వైద్య ఆరోగ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడకూడదు: ఎర్రబెల్లి
ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడకూడదు: ఎర్రబెల్లి
author img

By

Published : Jul 15, 2020, 9:55 PM IST

వరంగల్​ ఎంజీఎంలో కరోనా బాధితులు, సాధారణ రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడవద్దని, కరోనా బాధితులందరికి ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి జీతాలు పెంచేందుకు జీవో జారీ చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంజీఎంను పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. వెంటిలేటర్స్, పీపీఈ కిట్స్ వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.

కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ఎంజీఎంను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, హోమ్ క్వారంటైన్ లో చికిత్సపొందే వారికి అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైద్యుల వసతి కోసం హరిత కాకతీయ హోటల్​ను కేటాయిస్తున్నామని, ఆందోళన చెందవద్దని, హైదరాబాద్​కు పరుగులు పెట్టవద్దని మంత్రి సూచించారు. ప్రైవేటు వైద్యుల సేవలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఎంజీఎంలో తక్షణమే వెంటిలేటర్లు సమకూర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వరంగల్​ ఎంజీఎంలో కరోనా బాధితులు, సాధారణ రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడవద్దని, కరోనా బాధితులందరికి ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి జీతాలు పెంచేందుకు జీవో జారీ చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంజీఎంను పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. వెంటిలేటర్స్, పీపీఈ కిట్స్ వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.

కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ఎంజీఎంను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, హోమ్ క్వారంటైన్ లో చికిత్సపొందే వారికి అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైద్యుల వసతి కోసం హరిత కాకతీయ హోటల్​ను కేటాయిస్తున్నామని, ఆందోళన చెందవద్దని, హైదరాబాద్​కు పరుగులు పెట్టవద్దని మంత్రి సూచించారు. ప్రైవేటు వైద్యుల సేవలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఎంజీఎంలో తక్షణమే వెంటిలేటర్లు సమకూర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.