వర్షాకాలంలో ప్రజల ప్రయాణ అవస్థలు తొలగించడానికే నూతన రహదారి నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రూ.5 కోట్ల 60 లక్షలతో ఎఫ్సీఐ క్రాస్రోడ్డు నుంచి ఆర్ఎఫ్సీఎల్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల సమస్యలు పరిష్కరిస్తామని, కార్పొరేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే దిశగా పనులు చేస్తున్నామని కోరుకంటి చందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.