ETV Bharat / city

'రాత్రి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

author img

By

Published : May 9, 2021, 8:47 AM IST

నిజామాబాద్ నగరంలో కరోనా తీవ్రతరమవుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీసీపీ అరవింద్ బాబు సూచించారు. నగరంలోని నెహ్రూ చౌరస్తాలో దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

corona rules in nizamabad, corona cases in nizamabad
నిజామాబాద్​లో కరోనా వ్యాప్తి, నిజామాబాద్ డీసీపీ అరవింద్, నిజామాబాద్​లో కరోనా కేసులు

నిజామాబాద్ నగరంలోని నెహ్రూ చౌరస్తాలో డీసీపీ అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాలు తనిఖీ చేసి కరోనా నిబంధనలు పాటిస్తున్నారో లేదోనని పరిశీలించారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు వివరించారు.

కరోనా తీవ్రతరమవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ అరవింద్ బాబు సూచించారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు.

నిజామాబాద్ నగరంలోని నెహ్రూ చౌరస్తాలో డీసీపీ అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాలు తనిఖీ చేసి కరోనా నిబంధనలు పాటిస్తున్నారో లేదోనని పరిశీలించారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు వివరించారు.

కరోనా తీవ్రతరమవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ అరవింద్ బాబు సూచించారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.