నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస ఎన్నికల శంఖారావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు హెలీకాప్టర్ ద్వారా నిజామాబాద్ చేరుకోనున్నారు. ఇందుకోసం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకుంటారు. సభకు సుమారు 2లక్షల మందిని తరలించేందుకు గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి:తెదేపాకు రాజీ'నామా'....!