ETV Bharat / city

జడ్చర్ల, అచ్చంపేటలో ఊపందుకోనున్న ప్రచారం

author img

By

Published : Apr 23, 2021, 4:47 AM IST

Updated : Apr 23, 2021, 11:24 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో మున్సిపల్​ ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీల దృష్టంతా ప్రస్తుతం ప్రచారం పైనే ఉంది. జడ్చర్ల పురపాలికలో 27 వార్డులకు 112 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. అచ్చంపేటలో 20 వార్డులకు 66 మంది ఎన్నికల్లో పోటీ పడనున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపాలు ఈ మినీ పుర ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే ఉండనుంది.

municipal elections
మున్సిపల్​ ఎన్నికలు

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు... అభ్యర్థుల తరపున బీ-ఫాం సమర్పించడంతో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలచారో స్పష్టమైంది. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకు ఎన్నికల జరుగుతుండగా తెరాస 27 వార్డులు, కాంగ్రెస్ 25 వార్డులు, భాజపా 22 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. సీపీఐ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఒక్కరు, ఎంఐఎం నుంచి ఏడుగురు ఎన్నికల బరిలో నిలవగా అన్నివార్డుల్లో కలిపి 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

భాజపా నుంచి ఆశించి తెరాస నుంచి టికెట్​

మొత్తం అన్ని వార్డుల్లో 112 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. పార్టీ అభ్యర్థిత్వం దక్కుతుందన్న ఉద్దేశంతో ఒకే పార్టీ ఎక్కువ మంది ఆశావహులు పోటీపడ్డారు. బుజ్జగింపులు, తాయిలాలు, భవిష్యత్తు హామీల నడుమ చాలామంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలు ఎవరికి అభ్యర్థిత్వం కట్టబెడతాయన్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడింది. జడ్చర్లలో భాజపా నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడిన 15వ వార్టు మహిళ అభ్యర్థి అనూహ్యాంగా తెరాస తరఫున బీఫాం పొంది బరిలో నిలిచారు. ఈసందర్భంగా శుక్రవారం వారంతా తమ అనుయాయులతో తెరాసలో చేరనున్నారు.

తెరాస-భాజపా వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం

అచ్చంపేట పురపాలికలో 20వార్డులకు గాను మొత్తం 66 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా మొత్తం 20 వార్డుల్లోనూ అభ్యర్ధులను బరిలో నిలపగా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెరాస తరఫున గువ్వల బాలరాజు, కాంగ్రెస్ తరఫున నాగర్​కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి బీ-ఫాంలను అధికారులకు సమర్పించారు. 13వ వార్డు భాజపా అభ్యర్థి అంతటి బాలయ్య బీ ఫాం సమర్పించేందుకు రాగా. తెరాస-భాజపా వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం ఘర్షణ జరిగింది.

ఊపందుకోనున్న ప్రచారం

ఇరు వర్గాలను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. తెరాస దాడులు చేసినా తమ గెలుపును ఆపలేరని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు అచ్చంపేటలో ప్రచారం నిర్వహించకుండా, డబ్బులు పంచకుండా తెరాస రెండు సీట్లు గెలిచినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని వంశీ కృష్ణ గువ్వల బాలరాజుకు సవాలు విసిరారు. గతంలో 20కి 20 వార్డులు గెలిచిన చరిత్రను తిరగ రాస్తామని గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. ఉపసంహరణకు గడువు ముగియడంతో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఇవాళ్టి నుంచి అన్ని పార్టీల ప్రచారం ఊపందుకోనుంది.

ఇదీ చదవండి: తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు... అభ్యర్థుల తరపున బీ-ఫాం సమర్పించడంతో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలచారో స్పష్టమైంది. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకు ఎన్నికల జరుగుతుండగా తెరాస 27 వార్డులు, కాంగ్రెస్ 25 వార్డులు, భాజపా 22 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. సీపీఐ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఒక్కరు, ఎంఐఎం నుంచి ఏడుగురు ఎన్నికల బరిలో నిలవగా అన్నివార్డుల్లో కలిపి 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

భాజపా నుంచి ఆశించి తెరాస నుంచి టికెట్​

మొత్తం అన్ని వార్డుల్లో 112 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. పార్టీ అభ్యర్థిత్వం దక్కుతుందన్న ఉద్దేశంతో ఒకే పార్టీ ఎక్కువ మంది ఆశావహులు పోటీపడ్డారు. బుజ్జగింపులు, తాయిలాలు, భవిష్యత్తు హామీల నడుమ చాలామంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలు ఎవరికి అభ్యర్థిత్వం కట్టబెడతాయన్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడింది. జడ్చర్లలో భాజపా నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడిన 15వ వార్టు మహిళ అభ్యర్థి అనూహ్యాంగా తెరాస తరఫున బీఫాం పొంది బరిలో నిలిచారు. ఈసందర్భంగా శుక్రవారం వారంతా తమ అనుయాయులతో తెరాసలో చేరనున్నారు.

తెరాస-భాజపా వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం

అచ్చంపేట పురపాలికలో 20వార్డులకు గాను మొత్తం 66 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా మొత్తం 20 వార్డుల్లోనూ అభ్యర్ధులను బరిలో నిలపగా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెరాస తరఫున గువ్వల బాలరాజు, కాంగ్రెస్ తరఫున నాగర్​కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి బీ-ఫాంలను అధికారులకు సమర్పించారు. 13వ వార్డు భాజపా అభ్యర్థి అంతటి బాలయ్య బీ ఫాం సమర్పించేందుకు రాగా. తెరాస-భాజపా వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం ఘర్షణ జరిగింది.

ఊపందుకోనున్న ప్రచారం

ఇరు వర్గాలను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. తెరాస దాడులు చేసినా తమ గెలుపును ఆపలేరని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు అచ్చంపేటలో ప్రచారం నిర్వహించకుండా, డబ్బులు పంచకుండా తెరాస రెండు సీట్లు గెలిచినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని వంశీ కృష్ణ గువ్వల బాలరాజుకు సవాలు విసిరారు. గతంలో 20కి 20 వార్డులు గెలిచిన చరిత్రను తిరగ రాస్తామని గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. ఉపసంహరణకు గడువు ముగియడంతో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఇవాళ్టి నుంచి అన్ని పార్టీల ప్రచారం ఊపందుకోనుంది.

ఇదీ చదవండి: తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

Last Updated : Apr 23, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.