ETV Bharat / city

కొమ్ముగూడెం గ్రామంలో ఐటీడీఏ పీవో పర్యటన

author img

By

Published : Jun 3, 2021, 1:02 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొమ్ముగూడెం, ముత్యాలగూడెం పంచాయతీలలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామంలో ఐటీడీఏ పీవో​ పర్యటించి కట్టడి చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Telangana news
ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొవిడ్​ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నందున అధికారులు దృష్టి సారించారు. కొమ్ముగూడెం పంచాయతీలో ఐటీడీఏ పీవో గౌతమ్​ పర్యటించారు. కొమ్ముగూడెం పంచాయతీలోని రెండు గ్రామాల్లో 113 యాక్టివ్​ కేసులు ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపారు. కాగా ముత్యాల గూడెంలో 62 కేసులున్నట్లు వివరించారు.

ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. గ్రామాల్లో వందకు పైగా కేసులున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తహసీల్దారు తెలిపారు. వైరస్​ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గాంధీనగర్​లో ఐసోలేషన్​ కేంద్రం ఏర్పాటు చేశామని... అక్కడ చాలా మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొవిడ్​ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నందున అధికారులు దృష్టి సారించారు. కొమ్ముగూడెం పంచాయతీలో ఐటీడీఏ పీవో గౌతమ్​ పర్యటించారు. కొమ్ముగూడెం పంచాయతీలోని రెండు గ్రామాల్లో 113 యాక్టివ్​ కేసులు ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపారు. కాగా ముత్యాల గూడెంలో 62 కేసులున్నట్లు వివరించారు.

ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. గ్రామాల్లో వందకు పైగా కేసులున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తహసీల్దారు తెలిపారు. వైరస్​ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గాంధీనగర్​లో ఐసోలేషన్​ కేంద్రం ఏర్పాటు చేశామని... అక్కడ చాలా మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.