క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. టీమ్ఇండియా నేడు పాక్తో తలపడనుంది. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. భారత్-పాక్ మ్యాచ్లో టీమిండియానే ఆధిపత్యమని క్రీడాభిమానులు ధీమావ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా వాసులు చెబుతున్నారు. దాయాది కంటే భారత్ జట్టు ఎన్నో రకాలుగా పటిష్ఠంగా ఉందని.. ఈ మ్యాచ్లో టీమిండియాదే విజయమని చెబుతున్నారు.
నేటి సాయంత్రం దుబాయ్ వేదికగా భారత్- పాక్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్లో టీమిండియా విజయాన్ని కాక్షింస్తూ ఖమ్మంలో చిన్నారులు జాతీయ జెండాలు పట్టుకొని జయహో భారత్ నినాదాలు చేశారు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు క్రీడాభిమానులు చెప్పారు.
![T20 world cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13445802_t20-world-cup.jpg)
ఇదీచూడండి: