ETV Bharat / city

'వచ్చే ఏడాదైనా కోట్లాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణం జరగాలి' - telangana latest news

వచ్చే సంవత్సరమైనా సీతారాముల కల్యాణం కోట్లాది ప్రజల సమక్షంలో జరగాలని మంత్రి ఈటల రాజేందర్​ ఆకాంక్షించారు. రాములోరి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన.. కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.

eetala rajender
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్​
author img

By

Published : Apr 21, 2021, 4:20 PM IST

వచ్చే సంవత్సరమైనా సీతారాముల కల్యాణం కోట్లాది ప్రజల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన స్వామి వారి కల్యాణ వేడుకల్లో మంత్రి ఈటల, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ పాల్గొన్నారు.

తొలుత రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఈటల.. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మహోత్సవం అనంతరం.. ఆలయ అర్చకులు మంత్రిని సన్మానించారు.

శ్రీరామనవమి వేడుకలు.. దేశవ్యాప్తంగా వాడవాడలా జరిగేవని ఈటల గుర్తుచేసుకున్నారు. కరోనా విజృంభణతో గత రెండేళ్లుగా ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది కోట్లాది ప్రజల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. త్వరగా కోలుకోవాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు.

ఇవీచూడండి: భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం

వచ్చే సంవత్సరమైనా సీతారాముల కల్యాణం కోట్లాది ప్రజల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన స్వామి వారి కల్యాణ వేడుకల్లో మంత్రి ఈటల, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ పాల్గొన్నారు.

తొలుత రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఈటల.. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మహోత్సవం అనంతరం.. ఆలయ అర్చకులు మంత్రిని సన్మానించారు.

శ్రీరామనవమి వేడుకలు.. దేశవ్యాప్తంగా వాడవాడలా జరిగేవని ఈటల గుర్తుచేసుకున్నారు. కరోనా విజృంభణతో గత రెండేళ్లుగా ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది కోట్లాది ప్రజల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. త్వరగా కోలుకోవాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు.

ఇవీచూడండి: భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.