కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు పసుపు నిల్వలను మార్కెట్ యార్డుకు తరలించారు. మార్కెట్ ఛైర్పర్సన్ పొనగంటి శారద ప్రత్యేక పూజలు చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని సందర్శించి పసుపును తూకం వేసి కాంటాలను ప్రారంభించారు. అనంతరం వ్యాపారులు కొనుగోళ్లను ఆరంభించారు.
ఇదీ చదవండిః క్యాంప్ రాజకీయాలు షురూ