జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తులపై తేనెటీగల దాడి జరిగింది. దైవ దర్శనానంతరం చెట్టుకింద వంట చేసుకునేటప్పుడు వచ్చిన పొగతో ఒక్కసారిగా తేనెటీగలు భక్తులపైకి ఎగబడ్డాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలవ్వగా... వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులందరూ కరీంనగర్ వాసులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన భూమయ్య, మల్లేశ్, శంకర్లకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు.
కొండగట్టులో భక్తులపై తేనెటీగల దాడి
జగిత్యాల జిల్లా కొండగట్టులో భక్తులపై తేనెటీగల దాడి జరిగింది. ఘటనలో 10 మంది భక్తులు గాయపడగా వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తులపై తేనెటీగల దాడి జరిగింది. దైవ దర్శనానంతరం చెట్టుకింద వంట చేసుకునేటప్పుడు వచ్చిన పొగతో ఒక్కసారిగా తేనెటీగలు భక్తులపైకి ఎగబడ్డాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలవ్వగా... వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులందరూ కరీంనగర్ వాసులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన భూమయ్య, మల్లేశ్, శంకర్లకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు.
ఇదీ చదవండిః ఈ ఎఫ్ఎం ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ
రిపోర్టర్, లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం భారీగా తడిచింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ గాలులతో వర్షం కురవడంతో మార్కెట్ యార్డులోని ఐదు వేల క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం నీట మునిగింది. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 15 రోజుల క్రితం రైతులు అమ్మకానికి వరిధాన్యం పోయగా అధికారులు హమాలీల కొరత ఉందంటూ నేటికి కొనుగోలు చేయలేదు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో పాటు గత వారం రోజుల వ్యవధిలో ఈ మార్కెట్ యార్డ్ లో లో ఇప్పటివరకు మూడు సార్లు వారి ధాన్యం తడిసింది. మార్కెట్ తీసుకువచ్చిన వారిని రక్షించుకునేందుకు కనీసం టార్పాలిన్ కవర్లు కూడా అధికారులు ఇవ్వకపోవడంతో మార్కెట్ యార్డ్ లో పోసిన ధాన్యం రాశులు గడిచిపోయాయి. కుండపోత వర్షం కురవడంతో మార్కెట్ యార్డులోని వరి ధాన్యం నీటికి కొట్టుకుపోయింది. దీంతో వర్షం నిలిచిపోగా నే రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. నీటిని ఎత్తి పోయడం, ధాన్యాన్ని ఆరబెట్టడం లో నిమగ్న మయ్యారు. 5000 క్వింటాళ్లకు పైగా వరి కలిసినప్పటికీ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ లోని ఒక్కో రైతుకు చెందిన వారి ధాన్యం 10 క్వింటాళ్లకు పైగా తడవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బైట్: రైతు
బైట్: రైతు
బైట్: రైతు
బైట్: రైతు
Body:లక్ష్మణ్
Conclusion:పెద్దపల్లి