ETV Bharat / city

ఏపీ ఎంపీ రఘురామకృష్ణమరాజుపై వైకాపా ఎమ్మెల్యేల ఫిర్యాదు

author img

By

Published : Jul 9, 2020, 1:13 PM IST

ఏపీలోని నరసాపురం ఎంపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తమను అసభ్య పదజాలంతో కించపరిచారని ఆరోపించారు. తమ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ycp mla complaint against ycp mp raghuramakrishna raju
ఎంపీ రఘురామకృష్ణమరాజుపై వైకాపా ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు వరుసపెట్టి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు బాటలోనే... మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా రఘురామపై భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రసాద్​రాజు సైతం

ఎంపీ రఘురామకృష్ణమరాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసాపురం పీఎస్​లో వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్​రాజు సైతం ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు వరుసపెట్టి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు బాటలోనే... మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా రఘురామపై భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రసాద్​రాజు సైతం

ఎంపీ రఘురామకృష్ణమరాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసాపురం పీఎస్​లో వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్​రాజు సైతం ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి..

'అప్పుడు ముద్దులు పెట్టి.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.