ETV Bharat / city

యాదగిరి బెస్త మరణం అంబర్​పేట ప్రజలకు తీరని లోటు : భజన మండలి

author img

By

Published : Aug 24, 2020, 12:38 AM IST

అంబర్​పేట తెరాస సీనియర్ నాయకుడు గుంటి యాదగిరి బెస్త మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని తెలంగాణ గంగ గౌరీశ్వర భజన మండలి గుర్తు చేసుకుంది. గంగ భవాని అసోసియేషన్ , భీష్మ యువజన సమితి సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరి సంతాప సభను గోల్నాకలో నిర్వహించింది.

యాదగిరి బెస్త మరణం అంబర్​పేట ప్రజలకు తీరని లోటు : భజన మండలి
యాదగిరి బెస్త మరణం అంబర్​పేట ప్రజలకు తీరని లోటు : భజన మండలి

హైదరాబాద్ అంబర్​పేట గోల్నాకలో తెరాస సీనియర్ నాయకుడు, గంగపుత్ర సంఘం నేత గుంటి యాదగిరి బెస్త సంతాప సభను నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు యాదగిరి విశేష సేవలు అందించారని తెలంగాణ గంగ గౌరీశ్వర భజన మండలి కొనియాడింది. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యాదగిరి చురుగ్గా పాల్గొన్నాడని భజన మండలి అధ్యక్షుడు పూస నరసింహ బెస్త అన్నారు. అంబర్ పేట ప్రజలకు, గంగపుత్రులకు యాదగిరి మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మరణం అందరినీ కలచివేసిందని వాపోయారు. కార్యక్రమంలో గంగ భవాని అసోసియేషన్, భీష్మ యువజన సమితి సభ్యులు కైరంకొండ నర్సింగ్ రావు , కాపరవేని లింగం తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ అంబర్​పేట గోల్నాకలో తెరాస సీనియర్ నాయకుడు, గంగపుత్ర సంఘం నేత గుంటి యాదగిరి బెస్త సంతాప సభను నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు యాదగిరి విశేష సేవలు అందించారని తెలంగాణ గంగ గౌరీశ్వర భజన మండలి కొనియాడింది. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యాదగిరి చురుగ్గా పాల్గొన్నాడని భజన మండలి అధ్యక్షుడు పూస నరసింహ బెస్త అన్నారు. అంబర్ పేట ప్రజలకు, గంగపుత్రులకు యాదగిరి మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మరణం అందరినీ కలచివేసిందని వాపోయారు. కార్యక్రమంలో గంగ భవాని అసోసియేషన్, భీష్మ యువజన సమితి సభ్యులు కైరంకొండ నర్సింగ్ రావు , కాపరవేని లింగం తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'నవ్య ఆస్పత్రిని మూసివేయటం ప్రభుత్వ కుట్రలో భాగమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.