ETV Bharat / city

నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

author img

By

Published : Oct 26, 2020, 11:23 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టేందుకు సమ్మతి కోరుతూ.. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ లేఖ రాశారు. జడ్జిలపై ఆరోపణలతో లేఖ రాయడం, బహిర్గతం చేయడం వెనుక కుట్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలను ఉపేక్షిస్తే.. న్యాయవ్యవస్థ అంతానికి దారితీస్తుందని ఏజీకి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

jagan case
నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహా ఏపీ హైకోర్టు జడ్జిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై.. సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టును అపకీర్తిపాలు చేసేలా లేఖ రాసిన జగన్.. దాన్ని బహిర్గతం చేసిన ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంపై.. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాశారు.

నిరాధార ఆరోపణలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఏపీ సీఎం జగన్ రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం బహిర్గతం చేశారని.. ఏజీ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతీసేందుకే జడ్జిలపై ఆరోపణలు చేశారని.. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ఈ చర్యతో జగన్ న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య గీత దాటి ప్రవర్తించారని వివరించారు.

ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణ అంశంపై విచారణ జరుపుతున్నందు వల్ల... జస్టిస్ ఎన్వీ రమణపై నిరాధార ఆరోపణలతో విచారణ ఆపేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని అశ్వినీకుమార్ ఆరోపించారు. కోర్టులను భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఉందన్నారు. లేఖ రాయడం, బహిర్గతం చేయడంపై.. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అనేక అనుమానాలు లేవనెత్తారు. ఆ లేఖను సీజేఐ స్థానానికి ముందువరసలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ సహా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై దాడిగా అభివర్ణించారు.

కేసులను రాజకీయ పార్టీలకు అనుకూల న్యాయమూర్తులకు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు.. విపరీత పరిణామాలకు దారి తీస్తాయన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణ కేసుపైనా ఈ చర్య ప్రభావం చూపుతుందని.... అటార్నీ జనరల్‌కు రాసిన లేఖలో అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ప్రస్తావించారు.

ఇలాంటి ఆరోపణల లేఖను బహిర్గతం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అజేయ కల్లంకు తెలిసే ఉంటుందని అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ అన్నారు. అయినప్పటికీ ఆయన మీడియా ద్వారా బహిర్గతం చేశారన్నారు. ఈ విషయంపై ఇప్పటివరకూ ఏపీ సీఎం జగన్, అజేయ కల్లం విచారం వ్యక్తం చేయలేదన్న విషయాన్ని ఏజీ దృష్టికి తీసుకెళ్లారు.

వారి చర్యలను ఉపేక్షిస్తే.. తమ కేసుల్లో అనుకూలంగా లేరన్న నెపంతో జడ్జిలపై నేతల నిరాధార ఆరోపణలు పెరుగుతాయన్నారు. అది స్వతంత్ర న్యాయవ్యవస్థ అంతానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాలైనా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించనందువల్ల కోర్టు ధిక్కరణ చట్టం-1971 ప్రకారం చర్యలకు సమ్మతి కోరుతూ బాధ్యతాయుత న్యాయవాదిగా ఏజీకి లేఖ రాస్తున్నట్లు అశ్వినీకుమార్ ఉపాధ్యాయ తెలిపారు.

ఇవీచూడండి: ఏపీ: న్యాయ వ్యవస్థపై యుద్ధమా?

నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహా ఏపీ హైకోర్టు జడ్జిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై.. సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టును అపకీర్తిపాలు చేసేలా లేఖ రాసిన జగన్.. దాన్ని బహిర్గతం చేసిన ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంపై.. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాశారు.

నిరాధార ఆరోపణలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఏపీ సీఎం జగన్ రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం బహిర్గతం చేశారని.. ఏజీ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతీసేందుకే జడ్జిలపై ఆరోపణలు చేశారని.. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ఈ చర్యతో జగన్ న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య గీత దాటి ప్రవర్తించారని వివరించారు.

ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణ అంశంపై విచారణ జరుపుతున్నందు వల్ల... జస్టిస్ ఎన్వీ రమణపై నిరాధార ఆరోపణలతో విచారణ ఆపేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని అశ్వినీకుమార్ ఆరోపించారు. కోర్టులను భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఉందన్నారు. లేఖ రాయడం, బహిర్గతం చేయడంపై.. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అనేక అనుమానాలు లేవనెత్తారు. ఆ లేఖను సీజేఐ స్థానానికి ముందువరసలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ సహా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై దాడిగా అభివర్ణించారు.

కేసులను రాజకీయ పార్టీలకు అనుకూల న్యాయమూర్తులకు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు.. విపరీత పరిణామాలకు దారి తీస్తాయన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణ కేసుపైనా ఈ చర్య ప్రభావం చూపుతుందని.... అటార్నీ జనరల్‌కు రాసిన లేఖలో అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ప్రస్తావించారు.

ఇలాంటి ఆరోపణల లేఖను బహిర్గతం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అజేయ కల్లంకు తెలిసే ఉంటుందని అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ అన్నారు. అయినప్పటికీ ఆయన మీడియా ద్వారా బహిర్గతం చేశారన్నారు. ఈ విషయంపై ఇప్పటివరకూ ఏపీ సీఎం జగన్, అజేయ కల్లం విచారం వ్యక్తం చేయలేదన్న విషయాన్ని ఏజీ దృష్టికి తీసుకెళ్లారు.

వారి చర్యలను ఉపేక్షిస్తే.. తమ కేసుల్లో అనుకూలంగా లేరన్న నెపంతో జడ్జిలపై నేతల నిరాధార ఆరోపణలు పెరుగుతాయన్నారు. అది స్వతంత్ర న్యాయవ్యవస్థ అంతానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాలైనా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించనందువల్ల కోర్టు ధిక్కరణ చట్టం-1971 ప్రకారం చర్యలకు సమ్మతి కోరుతూ బాధ్యతాయుత న్యాయవాదిగా ఏజీకి లేఖ రాస్తున్నట్లు అశ్వినీకుమార్ ఉపాధ్యాయ తెలిపారు.

ఇవీచూడండి: ఏపీ: న్యాయ వ్యవస్థపై యుద్ధమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.