ETV Bharat / city

ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ పోరు

author img

By

Published : Nov 18, 2020, 8:11 PM IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. ఫిబ్రవరిలోనే వీటిని నిర్వహించాలని ఎస్​ఈసీ భావిస్తుండగా... సర్కార్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. ఇంతకీ ఎన్నికల సంఘం ఏమంటోంది?... ప్రభుత్వం ఏం చెబుతోంది?

what-the-state-election-commission-and-the-government-are-saying-about-the-conduct-of-elections
ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ పోరు

'ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. వీటికి న్యాయపరమైన ఇబ్బందులు లేవు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక.. ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం' ఇది ఏపీ ఎన్నికల సంఘం మంగళవారం చేసిన ప్రకటన. ఈ పంచాయతీ ఎన్నికల అంశం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారింది.

ఏపీలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయని, సోమవారం తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత, రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకున్నాకే, తగిన కొవిడ్‌ రక్షణ చర్యలు చేపడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టు వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్ని, వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఉపఎన్నికల్ని ఇటీవల నిర్వహించిన విషయాన్ని రమేశ్‌ కుమార్‌ ప్రస్తావించారు. ఈ క్రమంలో సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'ఇప్పుడు కష్టం'

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌కు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం లేఖ రాశారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు.. వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని‌ నీలం సాహ్ని లేఖలో పేర్కొన్నారు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్‌ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎస్‌ఈసీకి ఎన్నికల నిర్వహణపై సమాచారం అందిస్తామని తెలిపారు.‌

ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖపై ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​ తీవ్రంగా స్పందించారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని స్పష్టం చేశారు. సీఎస్ చర్య రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చెప్పారు. ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు.

గవర్నర్​తో కీలక భేటీ

పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో జరపాలని నిర్ణయించిన ఎస్ఈసీ.. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ మధ్యలోనే నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలిక ఎన్నికలు కొనసాగింపునకు అనుమతి కోరినట్లు తెలిసింది. తాము ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని... సహకారం అందించడం లేదని గవర్నర్​కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సమావేశం రద్దు

గవర్నర్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని అందరూ భావించారు. ఈ భేటీ తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సమాచారం ముందుగానే సంబంధిత అధికారులకు లేఖ రూపంలో తెలియజేశారు. అయితే చివరి నిమిషంలో వీడియో కాన్ఫరెన్స్‌ రద్దయ్యింది. సమావేశంపై సీఎస్ అభ్యంతరంతో పలు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు భేటీలో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఎస్​ఈసీ దృష్టికి వచ్చింది. అందుకే సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు రమేశ్​ కుమార్. జరిగిన వ్యవహారాలను ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడంపై ఎస్​ఈసీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చూడండి: 'కేంద్రంపై దేశవ్యాప్త పోరు.. డిసెంబర్​లో జాతీయ స్థాయి సమావేశం'

'ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. వీటికి న్యాయపరమైన ఇబ్బందులు లేవు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక.. ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం' ఇది ఏపీ ఎన్నికల సంఘం మంగళవారం చేసిన ప్రకటన. ఈ పంచాయతీ ఎన్నికల అంశం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారింది.

ఏపీలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయని, సోమవారం తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత, రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకున్నాకే, తగిన కొవిడ్‌ రక్షణ చర్యలు చేపడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టు వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్ని, వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఉపఎన్నికల్ని ఇటీవల నిర్వహించిన విషయాన్ని రమేశ్‌ కుమార్‌ ప్రస్తావించారు. ఈ క్రమంలో సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'ఇప్పుడు కష్టం'

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌కు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం లేఖ రాశారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు.. వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని‌ నీలం సాహ్ని లేఖలో పేర్కొన్నారు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్‌ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎస్‌ఈసీకి ఎన్నికల నిర్వహణపై సమాచారం అందిస్తామని తెలిపారు.‌

ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖపై ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​ తీవ్రంగా స్పందించారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని స్పష్టం చేశారు. సీఎస్ చర్య రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చెప్పారు. ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు.

గవర్నర్​తో కీలక భేటీ

పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో జరపాలని నిర్ణయించిన ఎస్ఈసీ.. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ మధ్యలోనే నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలిక ఎన్నికలు కొనసాగింపునకు అనుమతి కోరినట్లు తెలిసింది. తాము ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని... సహకారం అందించడం లేదని గవర్నర్​కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సమావేశం రద్దు

గవర్నర్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని అందరూ భావించారు. ఈ భేటీ తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సమాచారం ముందుగానే సంబంధిత అధికారులకు లేఖ రూపంలో తెలియజేశారు. అయితే చివరి నిమిషంలో వీడియో కాన్ఫరెన్స్‌ రద్దయ్యింది. సమావేశంపై సీఎస్ అభ్యంతరంతో పలు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు భేటీలో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఎస్​ఈసీ దృష్టికి వచ్చింది. అందుకే సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు రమేశ్​ కుమార్. జరిగిన వ్యవహారాలను ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడంపై ఎస్​ఈసీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చూడండి: 'కేంద్రంపై దేశవ్యాప్త పోరు.. డిసెంబర్​లో జాతీయ స్థాయి సమావేశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.