ETV Bharat / city

సంప్రదాయాలను కాపాడటమే సంస్కృతి మహోత్సవం ఉద్దేశం: ఉపరాష్ట్రపతి

author img

By

Published : Apr 2, 2022, 5:20 AM IST

Updated : Apr 2, 2022, 6:43 AM IST

National Sanskriti Mahotsav: హైదరాబాద్​లో జాతీయ సాంస్కృతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన.. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం సహా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని.. ఉపరాష్ట్రపతి తెలిపారు. భారతీయ భాషలు, యాసలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం.. అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు కళాభిమానులను ఆకట్టుకున్నాయి.

national Sanskriti Mahotsav
vice president venkaiah naidu
సంప్రదాయాలను కాపాడటమే సంస్కృతి మహోత్సవం ఉద్దేశం: ఉపరాష్ట్రపతి

National Sanskriti Mahotsav: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ సాంస్కృతి మహోత్సవాలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్​ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడటమే జాతీయ సంస్కృతి మహోత్సవం ఉద్దేశమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం సూపర్ శక్తిగా ఎదుగుతోందన్నారు. సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలకు ప్రోత్సాహం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ వ్యవహారాలు మాతృభాషలోనే జరిగేలా ప్రయత్నం చేయాలని.. ఆయన ఆకాంక్షించారు.

హైదరాబాద్ వేదికగా జాతీయ సంస్కృతి మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని.. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భిన్న సంస్కృతులు, భాషలు భారతదేశాన్ని ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఘంటసాల వంద సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని.. బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

సంప్రదాయాలు ఉట్టిపడేలా: మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చిత్రకళ, పుడ్‌ కోర్టు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరి కనువిందుగా సాగింది.

ఇదీచూడండి: Raj bhavan Ugadi celebrations: 'నేను శక్తిమంతురాలిని.. నా తలను ఎవరూ వంచలేరు'

సంప్రదాయాలను కాపాడటమే సంస్కృతి మహోత్సవం ఉద్దేశం: ఉపరాష్ట్రపతి

National Sanskriti Mahotsav: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ సాంస్కృతి మహోత్సవాలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్​ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడటమే జాతీయ సంస్కృతి మహోత్సవం ఉద్దేశమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం సూపర్ శక్తిగా ఎదుగుతోందన్నారు. సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలకు ప్రోత్సాహం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ వ్యవహారాలు మాతృభాషలోనే జరిగేలా ప్రయత్నం చేయాలని.. ఆయన ఆకాంక్షించారు.

హైదరాబాద్ వేదికగా జాతీయ సంస్కృతి మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని.. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భిన్న సంస్కృతులు, భాషలు భారతదేశాన్ని ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఘంటసాల వంద సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని.. బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

సంప్రదాయాలు ఉట్టిపడేలా: మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చిత్రకళ, పుడ్‌ కోర్టు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరి కనువిందుగా సాగింది.

ఇదీచూడండి: Raj bhavan Ugadi celebrations: 'నేను శక్తిమంతురాలిని.. నా తలను ఎవరూ వంచలేరు'

Last Updated : Apr 2, 2022, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.