ETV Bharat / city

తెరాస ఎంపీలు, మంత్రులకు కేంద్ర మంత్రి అపాయింట్​మెంట్​ ఫిక్స్​..

author img

By

Published : Mar 23, 2022, 2:58 PM IST

Updated : Mar 23, 2022, 5:27 PM IST

TRS MPs met Piyush Goyal: వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చించేందుకు దిల్లీ బయలుదేరిన తెలంగాణ మంత్రుల బృందానికి.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయిమెంట్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటల తర్వాత పార్లమెంట్ ఛాంబర్​లో ఆయనను.. తెరాస ఎంపీలు, మంత్రులు కలవనున్నారు. ​

trs mps met piyush goyal
పీయూష్ గోయల్‌ను కలిసిన తెరాస ఎంపీలు

TRS MPs met Piyush Goyal: వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చించేందుకు తెరాస ఎంపీలు, మంత్రులకు అపాయిమెంట్ ఫిక్సయింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్​ గోయల్..​ వారికి అపాయిమెంట్ షెడ్యూల్ ఖరారు చేశారు. రేపు ఉదయం 11.40 గంటలకు తనను కలవాల్సిందిగా సమాచారం అందించారు.

దిల్లీ కేంద్రంగా వరిపోరును అధికార తెరాస మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే హస్తిన చేరుకున్న మంత్రులు కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యచరణను ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెరాస ఎంపీలు.. ఉదయం రాజ్యసభ లాబీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో ప్రస్తావించిన ఎంపీలు నలుగులు తెలంగాణ మంత్రులు దిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని పీయూష్‌ని ఎంపీ కె.కేశవరావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అపాయిమెంట్ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్.. మంగళవారం దిల్లీ వెళ్లారు. యాసంగి వరి దాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేనుంది. కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, సంబంధిత అధికారులను కలుస్తామని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొని వస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: ST Reservations: ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం తీరుపట్ల తెరాస ఎంపీలు ఫైర్

TRS MPs met Piyush Goyal: వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చించేందుకు తెరాస ఎంపీలు, మంత్రులకు అపాయిమెంట్ ఫిక్సయింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్​ గోయల్..​ వారికి అపాయిమెంట్ షెడ్యూల్ ఖరారు చేశారు. రేపు ఉదయం 11.40 గంటలకు తనను కలవాల్సిందిగా సమాచారం అందించారు.

దిల్లీ కేంద్రంగా వరిపోరును అధికార తెరాస మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే హస్తిన చేరుకున్న మంత్రులు కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యచరణను ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెరాస ఎంపీలు.. ఉదయం రాజ్యసభ లాబీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో ప్రస్తావించిన ఎంపీలు నలుగులు తెలంగాణ మంత్రులు దిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని పీయూష్‌ని ఎంపీ కె.కేశవరావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అపాయిమెంట్ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్.. మంగళవారం దిల్లీ వెళ్లారు. యాసంగి వరి దాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేనుంది. కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, సంబంధిత అధికారులను కలుస్తామని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొని వస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: ST Reservations: ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం తీరుపట్ల తెరాస ఎంపీలు ఫైర్

Last Updated : Mar 23, 2022, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.