ఖాజీపేట-బళ్ళార్ష రూట్లో రాఘవపూర్-కొలనూర్ స్టేషన్ల మధ్య మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున... కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దారి మళ్లించిన రైళ్ల వివరాలను ఆధికారులు వెల్లడించారు. విశాఖపట్టణం-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-చప్రా ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ-ధనపూర్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్-నార్త్ పటేల్ నగర్ పార్శిల్ ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ-హజ్రత్ నిజాముద్దీన్ పార్శిల్ ఎక్స్ప్రెస్, త్రివేండ్రం-న్యూఢిల్లీ, కుద్రరోడ్-ఓకా ఎక్స్ప్రెస్, కుద్రరోడ్-అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-యశ్వంత్పూర్, మైసూర్-జైపూర్, రేణిగుంట-హజ్రత్ నిజాముద్దీన్ దూద్ దురంతో రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'నాణ్యత లేని ఆహారం ఇవ్వడమంటే రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే'