1. మన వైపే అని నిరూపించాలి..
రాష్ట్రంలోని ఆరు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎల్ఆర్ఎస్పై ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పలువురు నేతలు సీఎంకు తెలిపారు. రెండు ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానాల్లోనూ తెరాసదే గెలుపు ఉంటుందని నేతలు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దుబ్బాక ఉప ఎన్నికకు రెడీ..
రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పోరాడతాం..
హాథ్రస్ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. బాధితురాలి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తన బాధ్యతలను అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అక్కడి ప్రజలకు వరం..
ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ సొరంగ మార్గం హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ ప్రజలకు వరప్రదాయినిగా నిలవనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దీని ద్వారా ప్రజలుకు మెరుగైన వైద్య, వ్యాపార సేవలు సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, హిమాచల్ ప్రదేశ్ ప్రజల మధ్య ప్రత్యేక బంధానికి 'అటల్ సొరంగ మార్గం' సాక్ష్యంగా నిలుస్తుందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. న్యాయం చేస్తాం..
యూపీ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారుల బృందం హాథ్రస్లో పర్యటించింది. బాధితురాలి కుటుంబం నుంచి వాంగ్మూలం తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతుందని తెలిపింది. దోషులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పొత్తు కుదిరింది..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. అత్యధికంగా రాష్ట్రీయ జనతా దళ్-144 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారత్-నేపాల్ ఎక్స్పో
భారత్-నేపాల్ మధ్య రెండో విడత పెట్టుబడుల ఎక్స్పో అండ్ కాంక్లేవ్ను అక్టోబర్ 16-18 తేదీల్లో నిర్వహించనున్నారు. నేపాల్లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఘనవిజయం..
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన . కోహ్లీ, దేవ్దత్ మెరుపులు మెరిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. బాలివుడ్లో ఉంది..
బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా నడుస్తుందని చెప్పిన హీరో అక్షయ్కుమార్.. దాన్ని ఎలా తొలగించాలనే విషయమై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. అయితే చిత్రసీమలో ఉన్న ప్రతిఒక్కరు ఇందులో భాగస్వాములని భావించడం సరికాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.పారితోషికాల్లో కోత..
థియేటర్లు తెరుచుకునే ముందు తెలుగు సినీపరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల తగ్గింపుపై తెలుగు సినీ నిర్మాతలు, 'మా' నటీనటుల సంఘం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. యాక్టివ్ తెలుగు సినీ నిర్మాతల గిల్డ్, 'మా' నటీనటుల సంఘం సమావేశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.