ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @ 9PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9PM
టాప్‌టెన్‌ న్యూస్‌@9PM
author img

By

Published : Oct 3, 2020, 9:00 PM IST

1. మన వైపే అని నిరూపించాలి..

రాష్ట్రంలోని ఆరు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం కేసీఆర్​ ఆరా తీశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పలువురు నేతలు సీఎంకు తెలిపారు. రెండు ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానాల్లోనూ తెరాసదే గెలుపు ఉంటుందని నేతలు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. దుబ్బాక ఉప ఎన్నికకు రెడీ..

రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పోరాడతాం..

హాథ్రస్​ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. బాధితురాలి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​.. తన బాధ్యతలను అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అక్కడి ప్రజలకు వరం..

ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్​ సొరంగ మార్గం హిమాచల్ ​ప్రదేశ్​, లద్దాఖ్​ ప్రజలకు వరప్రదాయినిగా నిలవనుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. దీని ద్వారా ప్రజలుకు మెరుగైన వైద్య, వ్యాపార సేవలు సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, హిమాచల్​ ప్రదేశ్​ ప్రజల మధ్య ప్రత్యేక బంధానికి 'అటల్​ సొరంగ మార్గం' సాక్ష్యంగా నిలుస్తుందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. న్యాయం చేస్తాం..

యూపీ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారుల బృందం హాథ్రస్​లో పర్యటించింది. బాధితురాలి కుటుంబం నుంచి వాంగ్మూలం తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతుందని తెలిపింది. దోషులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పొత్తు కుదిరింది..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు కలిసే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. అత్యధికంగా రాష్ట్రీయ జనతా దళ్​-144 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్​ 70 చోట్ల పోటీ చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. భారత్-నేపాల్ ఎక్స్‌పో

భారత్-నేపాల్ మధ్య రెండో విడత పెట్టుబడుల ఎక్స్​పో అండ్ కాంక్లేవ్​ను అక్టోబర్ 16-18 తేదీల్లో నిర్వహించనున్నారు. నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఘనవిజయం..

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన . కోహ్లీ, దేవ్​దత్ మెరుపులు మెరిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బాలివుడ్​లో ఉంది..

బాలీవుడ్​లో డ్రగ్స్​ మాఫియా నడుస్తుందని చెప్పిన హీరో అక్షయ్​కుమార్​.. దాన్ని ఎలా తొలగించాలనే విషయమై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. అయితే చిత్రసీమలో ఉన్న ప్రతిఒక్కరు ఇందులో భాగస్వాములని భావించడం సరికాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.పారితోషికాల్లో కోత..

థియేటర్లు తెరుచుకునే ముందు తెలుగు సినీపరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల తగ్గింపుపై తెలుగు సినీ నిర్మాతలు, 'మా' నటీనటుల సంఘం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. యాక్టివ్​​ తెలుగు సినీ నిర్మాతల గిల్డ్​, 'మా' నటీనటుల సంఘం సమావేశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. మన వైపే అని నిరూపించాలి..

రాష్ట్రంలోని ఆరు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం కేసీఆర్​ ఆరా తీశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పలువురు నేతలు సీఎంకు తెలిపారు. రెండు ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానాల్లోనూ తెరాసదే గెలుపు ఉంటుందని నేతలు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. దుబ్బాక ఉప ఎన్నికకు రెడీ..

రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పోరాడతాం..

హాథ్రస్​ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. బాధితురాలి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​.. తన బాధ్యతలను అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అక్కడి ప్రజలకు వరం..

ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్​ సొరంగ మార్గం హిమాచల్ ​ప్రదేశ్​, లద్దాఖ్​ ప్రజలకు వరప్రదాయినిగా నిలవనుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. దీని ద్వారా ప్రజలుకు మెరుగైన వైద్య, వ్యాపార సేవలు సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, హిమాచల్​ ప్రదేశ్​ ప్రజల మధ్య ప్రత్యేక బంధానికి 'అటల్​ సొరంగ మార్గం' సాక్ష్యంగా నిలుస్తుందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. న్యాయం చేస్తాం..

యూపీ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారుల బృందం హాథ్రస్​లో పర్యటించింది. బాధితురాలి కుటుంబం నుంచి వాంగ్మూలం తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతుందని తెలిపింది. దోషులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పొత్తు కుదిరింది..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు కలిసే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. అత్యధికంగా రాష్ట్రీయ జనతా దళ్​-144 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్​ 70 చోట్ల పోటీ చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. భారత్-నేపాల్ ఎక్స్‌పో

భారత్-నేపాల్ మధ్య రెండో విడత పెట్టుబడుల ఎక్స్​పో అండ్ కాంక్లేవ్​ను అక్టోబర్ 16-18 తేదీల్లో నిర్వహించనున్నారు. నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఘనవిజయం..

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది కోహ్లీసేన . కోహ్లీ, దేవ్​దత్ మెరుపులు మెరిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బాలివుడ్​లో ఉంది..

బాలీవుడ్​లో డ్రగ్స్​ మాఫియా నడుస్తుందని చెప్పిన హీరో అక్షయ్​కుమార్​.. దాన్ని ఎలా తొలగించాలనే విషయమై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. అయితే చిత్రసీమలో ఉన్న ప్రతిఒక్కరు ఇందులో భాగస్వాములని భావించడం సరికాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.పారితోషికాల్లో కోత..

థియేటర్లు తెరుచుకునే ముందు తెలుగు సినీపరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల తగ్గింపుపై తెలుగు సినీ నిర్మాతలు, 'మా' నటీనటుల సంఘం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. యాక్టివ్​​ తెలుగు సినీ నిర్మాతల గిల్డ్​, 'మా' నటీనటుల సంఘం సమావేశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.