ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్@9PM

author img

By

Published : May 22, 2021, 8:59 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@ 9PM
టాప్‌టెన్ న్యూస్ @ 9PM
  • వీసీలొచ్చారు...

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకంపై నిరీక్షణకు తెరపడింది. పది విశ్వ విద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ... ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్తగా 3,308 కరోనా కేసులు...

రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించినా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు. గడిచిన 24 గంటల్లో 63,120 కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,308 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. కరోనా మహమ్మారికి మరో 21 మంది బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏపనైనా పది లోపే...

ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును డీజీపీ స్వయంగా పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉల్లంఘనులపై ఉక్కుపాదం...

సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు పోలీసులు లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో.. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రైవేటుకు టీకాలు ఎలా ఇస్తారు?...

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ రాశారు. టీకాల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని లేఖలో ప్రశ్నించారు. ఈ పరిస్థితిల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గాలి ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి...

దేశంలో ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న బ్లాక్​ ఫంగస్​ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు వైద్యులు. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే.. దానిని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మార్స్​పై కాలు మోపిన చైనా...

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చైనా పంపిన తియాన్​వెన్​-1 వ్యోమనౌకలోని ఆర్బిటర్​ నుంచి రోవర్​ విడిపోయి విజయవంతంగా అంగారకుడిపై కాలు మోపింది​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేంద్రానికి ఆర్​బీఐ రూ.లక్ష కోట్లు...

గడిచిన రెండు దశాబ్దాల్లో ఆర్​బీఐ నుంచి కేంద్రానికి బదిలీ అవుతోన్న మిగులు సుమారు రూ.10 వేల కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రూ. లక్ష కోట్లకు చేరింది. ఇంత భారీ మొత్తాలను ఆర్​బీఐ ఎందుకు బదిలీ చేస్తోంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వార్నర్ చిందులు...

ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్​ డేవిడ్ వార్నర్​ మరో తెలుగు పాటకు చిందులేశాడు. తెలుగు హీరో అల్లు అర్జున్​ నటించిన 'రాములో రాములా' పాటకు డ్యాన్స్​లేసిన వీడియోను తన ఇన్​స్టాలో పోస్టు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్...

పలు భాషల్లో ఎన్నో వందల పాటలు పాడిన శ్రేయా ఘోషల్.. శనివారం మగపిల్లాడికి జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వీసీలొచ్చారు...

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకంపై నిరీక్షణకు తెరపడింది. పది విశ్వ విద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ... ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్తగా 3,308 కరోనా కేసులు...

రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించినా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు. గడిచిన 24 గంటల్లో 63,120 కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,308 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. కరోనా మహమ్మారికి మరో 21 మంది బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏపనైనా పది లోపే...

ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును డీజీపీ స్వయంగా పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉల్లంఘనులపై ఉక్కుపాదం...

సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు పోలీసులు లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో.. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రైవేటుకు టీకాలు ఎలా ఇస్తారు?...

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ రాశారు. టీకాల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని లేఖలో ప్రశ్నించారు. ఈ పరిస్థితిల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గాలి ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి...

దేశంలో ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న బ్లాక్​ ఫంగస్​ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు వైద్యులు. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే.. దానిని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మార్స్​పై కాలు మోపిన చైనా...

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చైనా పంపిన తియాన్​వెన్​-1 వ్యోమనౌకలోని ఆర్బిటర్​ నుంచి రోవర్​ విడిపోయి విజయవంతంగా అంగారకుడిపై కాలు మోపింది​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేంద్రానికి ఆర్​బీఐ రూ.లక్ష కోట్లు...

గడిచిన రెండు దశాబ్దాల్లో ఆర్​బీఐ నుంచి కేంద్రానికి బదిలీ అవుతోన్న మిగులు సుమారు రూ.10 వేల కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రూ. లక్ష కోట్లకు చేరింది. ఇంత భారీ మొత్తాలను ఆర్​బీఐ ఎందుకు బదిలీ చేస్తోంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వార్నర్ చిందులు...

ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్​ డేవిడ్ వార్నర్​ మరో తెలుగు పాటకు చిందులేశాడు. తెలుగు హీరో అల్లు అర్జున్​ నటించిన 'రాములో రాములా' పాటకు డ్యాన్స్​లేసిన వీడియోను తన ఇన్​స్టాలో పోస్టు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్...

పలు భాషల్లో ఎన్నో వందల పాటలు పాడిన శ్రేయా ఘోషల్.. శనివారం మగపిల్లాడికి జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.