- కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ డేటా విడుదల
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ తుది డేటాను ఆ సంస్థ విడుదల చేసింది. కరోనాపై 77.80 శాతం సమర్థవంతంగా టీకా పని చేస్తుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'న్యాయవ్యవస్థను రక్షించే బాధ్యత లాయర్లదే'
న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపేలా ఏవైనా దాడులు జరిగితే వాటి నుంచి రక్షణ కల్పించాల్సింది వారే అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరత్ సింగ్ రాజీనామా చేయటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జలజగడం తీవ్రం..
తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రమైన నేపథ్యంలో కృష్ణా యాజమాన్యం బోర్డు రంగంలోకి దిగింది. ఈనెల 9న సమావేశం జరపాలని నిర్ణయించిన బోర్డు.. విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలపైనా భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. తాజా పరిస్థితిని కేంద్రం దృష్టికి యాజమాన్య బోర్డు తీసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉద్యోగ ప్రకటన లేదు.. వయసు దాటిపోతోంది..
డిగ్రీ పట్టా చేత పట్టుకుని.. ప్రభుత్వం చేసే ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురు చూసినా ఫలితం లేకుండా పోతుంది. సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసే లోపు కొందరికి వయో పరిమితి కూడా దాటిపోతోంది. ప్రభుత్వం ఉద్యోగం చేయాలన్న వారి ఆశలు అడిశయాలు అవుతుండగా... వారి భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం..
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతోంది. అయినప్పటికీ నిధుల రికవరీ మాత్రం 2 శాతానికి మించకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళ అనీ చూడలేదు.. చెట్టుకు కట్టేసి..!
మెట్టింటి నుంచి వచ్చిన ఓ మహిళపై పుట్టింటివారే కర్కశంగా ప్రవర్తించారు. అత్యంత కిరాతకంగా జుట్టు పట్టి ఊడ్చి కొట్టారు. చెట్టుకు కట్టేసి పైశాచిక ఆనందం పొందారు. మధ్యప్రదేశ్లో జరిగిందీ అమానవీయ ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చాలా ప్రమాదకరమైన కాలంలో ప్రపంచం'
కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం.. 'చాలా ప్రమాదకరమైన కాలంలో' ఉందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాదాపు 100 దేశాల్లో కరోనా డెల్టా వేరియంట్ను గుర్తించినట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్..
ఇటీవలే వ్యాఖ్యాతగా మారిన టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య గురువారం జరిగిన రెండో వన్డేకు కార్తీక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. క్రికెట్ బ్యాట్లు పరాయి పురుషుల భార్యల్లాంటివని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రామోజీ ఫిల్మ్ సిటీలో హీరోల సందడి
రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల టాలీవుడ్లో షూటింగ్లకు అనుమతి లభించినట్లయింది. ఈ నేపథ్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణల సందడి కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.