రాష్ట్రంలో ఇవాళ మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 928కి చేరింది. 711 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 194 మంది బాధితులు ఇంటికి వెళ్లారు. 23 మంది మృతి చెందారు.
నేడు నమోదైన 56 కేసుల్లో.. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26, జీహెచ్ఎంసీ పరిధిలో 19, నిజామాబాద్లో 3, గద్వాల, ఆదిలాబాద్లో ఇద్దరికి కొవిడ్ సోకింది. ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఒక్కో కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని వైద్యారోగ్య శాఖ హెల్త్బులిటెన్లో పేర్కొంది.
ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'