పాక్ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్యకారులు మరికొద్ది గంటల్లో విజయవాడకు చేరుకోనున్నారు. హైదరాబాద్ చేరుకున్న వారు ముఖ్యమంత్రి జగన్ను కలుస్తారని మంత్రి మోపిదేవి తెలిపారు. 14 నెలలుగా పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న జాలర్లను నిన్న వాఘా సరిహద్దు వద్ద మంత్రి మోపిదేవి వెంకటరమణ బృందానికి అప్పగించింది. మరో ఇద్దరు జాలర్లు కూడా త్వరలో విడుదలవుతారని వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం అన్నివిధాలా వారికి అండగా ఉంటుందని మంత్రి మోపిదేవి అన్నారు. 20 మంది జాలర్లకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఆంధ్రా జాలర్లను భారత్కు అప్పగించిన పాక్.. రేపు స్వగ్రామాలకు...