తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డైరీని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్తో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిప్లొమా విద్యార్హత కలిగిన ఏఈవోల సమస్యలను మంత్రి వివరించినట్లు రాజేందర్ తెలిపారు. డిప్లొమా విద్యార్హత కలిగిన ఏఈవోలు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ విరమణ పొందే వరకు.. ఒకే క్యాడర్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్నారని తెలిపారు. మొత్తం ఉద్యోగ సర్వీస్లో కనీసం ఒక పదోన్నతి వ్యవసాయ అధికారిగానైనా కల్పించాలని కోరినట్లు రాజేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖలో అధిక సంఖ్యలో గ్రేడ్-2 వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని.. దానికి అనుగుణంగా 20శాతం గ్రేడ్-1 క్యాడర్ పోస్టుల్లో సంఖ్యను పెంచాలని కోరారు. అలానే గ్రేడ్-1 పోస్టులకు డిప్యూటీ అగ్రికల్చర్ ఆఫీసర్గా పేరు మార్చి పదోన్నతి కల్పించి... పదోన్నతి లేని గ్రేడ్-1 వ్యవసాయ విస్తరణ అధికారుల ఆత్మస్థైర్యాన్ని పెంచాలని మంత్రిని కోరినట్లు రాజేందర్ తెలిపారు.
ఇదీ చదవండి: 'కరోనా త్వరగా తొలిగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలి'