ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: మూతపడ్డ గోవిందరాజస్వామి ఆలయం

author img

By

Published : Jun 12, 2020, 5:33 PM IST

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం 2 రోజులు మూసేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. ఆలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గుడిని పూర్తిగా శానిటైజ్ చేసి ఆదివారం తిరిగి తెరుస్తామని తితిదే చెప్పింది.

కరోనా ఎఫెక్ట్
మూతపడ్డ గోవిందరాజస్వామి ఆలయం

తిరుప‌తిలోని గోవింద‌రాజ‌స్వామి వారి ఆల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేల‌టంతో.. శుక్ర‌, శ‌నివారాల్లో ఆల‌యాన్ని మూసేస్తున్నట్లు తితిదే తెలిపింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆల‌యాన్ని పూర్తిగా శుద్ధి చేసిన త‌రువాత ఆదివారం నుంచి యధావిథిగా తెరుస్తామని తెలిపారు.

తితిదే ఉద్యోగికి వేర్వేరు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండటంతో రెగ్యుల‌ర్ చెక‌ప్‌కు వెళ్లగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. అతను విధులు నిర్వహించిన పాత హుజుర్ ఆఫీస్‌, పీహెచ్​ స్టోర్​ను శానిటైజ్ చేస్తున్నామని తితిదే అధికారులు చెప్పారు. ఆ ఉద్యోగి ప్రాథమిక కాంటాక్ట్స్​ గురించి ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి... హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్​

తిరుప‌తిలోని గోవింద‌రాజ‌స్వామి వారి ఆల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేల‌టంతో.. శుక్ర‌, శ‌నివారాల్లో ఆల‌యాన్ని మూసేస్తున్నట్లు తితిదే తెలిపింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆల‌యాన్ని పూర్తిగా శుద్ధి చేసిన త‌రువాత ఆదివారం నుంచి యధావిథిగా తెరుస్తామని తెలిపారు.

తితిదే ఉద్యోగికి వేర్వేరు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండటంతో రెగ్యుల‌ర్ చెక‌ప్‌కు వెళ్లగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. అతను విధులు నిర్వహించిన పాత హుజుర్ ఆఫీస్‌, పీహెచ్​ స్టోర్​ను శానిటైజ్ చేస్తున్నామని తితిదే అధికారులు చెప్పారు. ఆ ఉద్యోగి ప్రాథమిక కాంటాక్ట్స్​ గురించి ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి... హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.