ETV Bharat / city

TTD tickets: భక్తులకు తితిదే శుభవార్త.. సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపు - tirumala sarvadarshan tokens increased

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) సర్వదర్శనం టోకెన్ల(Sarva darshan Tokens) సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇకపై రోజుకు ఎనిమిది వేల మందికి టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. శ్రీవారి టిక్కెట్లను ఆన్‌ లైన్‌ ద్వారా విడుదల చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకు వచ్చింది.

TTD
తిరుమల తిరుపతి దేవస్థానం
author img

By

Published : Sep 19, 2021, 9:58 PM IST

ఏపీలో తిరుమలలోని శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల (TTD sarva darshan tokens) సంఖ్యను పెంచారు తితిదే అధికారులు. రోజుకు 8 వేల మందికి టోకెన్లు(Tokens) జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టోకెన్లు జారీ చేయనున్నారు. నేటి నుంచి ఏకాంతసేవ రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నారు. రాత్రి 12 గంటల వరకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.

టికెట్ల జారీకి ప్రత్యేక పోర్టల్..!

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను ఆన్‌ లైన్‌ ద్వారా విడుదల చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు కరెంట్‌ బుకింగ్‌ ద్వారానే ఉచిత టోకెన్లను జారీ చేసిన తితిదే.. కరోనాతో భక్తులు గుమిగూడే పరిస్థితి రానివ్వకుండా ఉండేందుకు ఆన్​‌లైన్‌ విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. త్వరలోనే ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. దీని ద్వారా ఆర్జితసేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల మాదిరిగా భక్తులు ఉచిత దర్శన టోకెన్లను కూడా ముందుగానే నమోదు చేసుకునే అవకాశం ఉండనుంది.

ఇదీ చదవండి: TTD: వారం రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ..

ఏపీలో తిరుమలలోని శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల (TTD sarva darshan tokens) సంఖ్యను పెంచారు తితిదే అధికారులు. రోజుకు 8 వేల మందికి టోకెన్లు(Tokens) జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టోకెన్లు జారీ చేయనున్నారు. నేటి నుంచి ఏకాంతసేవ రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నారు. రాత్రి 12 గంటల వరకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.

టికెట్ల జారీకి ప్రత్యేక పోర్టల్..!

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను ఆన్‌ లైన్‌ ద్వారా విడుదల చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు కరెంట్‌ బుకింగ్‌ ద్వారానే ఉచిత టోకెన్లను జారీ చేసిన తితిదే.. కరోనాతో భక్తులు గుమిగూడే పరిస్థితి రానివ్వకుండా ఉండేందుకు ఆన్​‌లైన్‌ విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. త్వరలోనే ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. దీని ద్వారా ఆర్జితసేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల మాదిరిగా భక్తులు ఉచిత దర్శన టోకెన్లను కూడా ముందుగానే నమోదు చేసుకునే అవకాశం ఉండనుంది.

ఇదీ చదవండి: TTD: వారం రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.