ఉప్పల్ రామాంతపూర్కు చెందిన లక్ష్మణ్ శనివారం రాత్రి బాలంరాయి, తాడ్బంద్ నాలాపై నడుస్తూ.. అందులో పడిపోయాడు. రాత్రంతా నాలాలోనే ఉన్న ఆ వ్యక్తి పైకి రాలేక అవస్థలు పడ్డాడు. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బోయిన్పల్లి వినయ్ కుమార్, అహ్మద్ పాషా వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని కాపాడారు. శరీరంపై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేసి.. బట్టలు మార్పించారు. వివరాలు తెలుసుకుని ఇంటికి పంపించారు.

ఇదీ చూడండి: వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు