ETV Bharat / city

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం - Telangana government

IPS officer Abhishek Mohanty
IPS officer Abhishek Mohanty
author img

By

Published : Mar 15, 2022, 4:23 PM IST

Updated : Mar 15, 2022, 4:44 PM IST

16:22 March 15

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రాష్ట్ర కేడర్​లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించిన అభిషేక్... తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు.

వాదనలు విన్న క్యాట్... అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మొహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని అటు ఏపీని.. విధుల్లో చేర్చుకోవాలని ఇటు తెలంగాణను ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ.. విధుల్లోకి చేర్చుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో తెలంగాణ సీఎస్​పై అభిషేక్ మహంతి ట్రైబ్యునల్ లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇవాళ(మార్చి 15) వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

క్యాట్ విచారణ నిలిపివేయాలని సోమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు... అభిషేక్ మహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సీఎస్​ వ్యక్తిగతంగా హాజరు కావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.

ఇదీ చూడండి:

16:22 March 15

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రాష్ట్ర కేడర్​లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించిన అభిషేక్... తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు.

వాదనలు విన్న క్యాట్... అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మొహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని అటు ఏపీని.. విధుల్లో చేర్చుకోవాలని ఇటు తెలంగాణను ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ.. విధుల్లోకి చేర్చుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో తెలంగాణ సీఎస్​పై అభిషేక్ మహంతి ట్రైబ్యునల్ లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇవాళ(మార్చి 15) వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

క్యాట్ విచారణ నిలిపివేయాలని సోమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు... అభిషేక్ మహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సీఎస్​ వ్యక్తిగతంగా హాజరు కావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.

ఇదీ చూడండి:

Last Updated : Mar 15, 2022, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.