ETV Bharat / city

Bandi Sanjay About Job Notifications: 'భాజపాకు భయపడే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు'

author img

By

Published : Mar 9, 2022, 7:17 PM IST

Bandi Sanjay About Job Notifications : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటన.. భాజపా విజయమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టేదే లేదని తెలిపారు. తమ పార్టీ పెడుతున్న సెగతోనే కేసీఆర్ ప్రగతి భవన్ వీడి జిల్లాలు తిరుగుతున్నారని చెప్పారు.

Bandi Sanjay About Job Notifications
Bandi Sanjay About Job Notifications
'ఉద్యోగ నోటిఫికేషన్లు భాజపా విజయమే'

Bandi Sanjay About Job Notifications : కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం విడ్డూరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జోనల్ విధానానికి 2018లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారు. కేసీఆర్ నాలుగేళ్లు ఆలస్యం చేసి కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 12 వేల మంది విద్యావాలంటీర్లను, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని అన్నారు. 15వేల మంది స్టాఫ్​నర్సులను పునరుద్ధరించలేదని చెప్పారు.

Bandi Sanjay Reaction on Job Notifications : 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. ఆలస్యంగానైనా వచ్చిన ఉద్యోగాల ప్రకటనను భాజపా విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిపై ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. భాజపా పెడుతున్న సెగతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ వీడి జిల్లాలు తిరుగుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఆశపెట్టి నెరవేర్చకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు ఇచ్చే వరకు పోరాడతామని స్ఫష్టం చేశారు.

Job Notifications in Telangana : "అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భాజపా మిలియన్ మార్చ్ చేస్తుందని భయపడే కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేశారు. ఏడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్.. ఊరికో జాబ్ కూడా ఇవ్వలేదు. బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్న కేసీఆర్.. మిగతా లక్ష ఉద్యోగాలు ఎక్కడికిపోయాయో చెప్పాలి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టం. కేసీఆర్ ఉద్యోగ ప్రకటనల హమీ నిలబెట్టుకుంటారన్న నమ్మకం మాకు లేదు."

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'ఉద్యోగ నోటిఫికేషన్లు భాజపా విజయమే'

Bandi Sanjay About Job Notifications : కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం విడ్డూరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జోనల్ విధానానికి 2018లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారు. కేసీఆర్ నాలుగేళ్లు ఆలస్యం చేసి కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 12 వేల మంది విద్యావాలంటీర్లను, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని అన్నారు. 15వేల మంది స్టాఫ్​నర్సులను పునరుద్ధరించలేదని చెప్పారు.

Bandi Sanjay Reaction on Job Notifications : 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. ఆలస్యంగానైనా వచ్చిన ఉద్యోగాల ప్రకటనను భాజపా విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిపై ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. భాజపా పెడుతున్న సెగతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ వీడి జిల్లాలు తిరుగుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఆశపెట్టి నెరవేర్చకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు ఇచ్చే వరకు పోరాడతామని స్ఫష్టం చేశారు.

Job Notifications in Telangana : "అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భాజపా మిలియన్ మార్చ్ చేస్తుందని భయపడే కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేశారు. ఏడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్.. ఊరికో జాబ్ కూడా ఇవ్వలేదు. బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్న కేసీఆర్.. మిగతా లక్ష ఉద్యోగాలు ఎక్కడికిపోయాయో చెప్పాలి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టం. కేసీఆర్ ఉద్యోగ ప్రకటనల హమీ నిలబెట్టుకుంటారన్న నమ్మకం మాకు లేదు."

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.