ETV Bharat / city

కోర్టు సూచనలు, మా అభ్యర్థనను సభాపతి తిరస్కరించారు: ఈటల రాజేందర్​

author img

By

Published : Mar 15, 2022, 10:18 AM IST

Updated : Mar 15, 2022, 10:43 AM IST

bjp mlas
bjp mlas

10:15 March 15

కోర్టు సూచనలు, మా అభ్యర్థనను సభాపతి తిరస్కరించారు: ఈటల రాజేందర్​

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సస్పెండైన భాజపా ఎమ్మెల్యేలు.. హైకోర్టు సూచనతో ఇవాళ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. తొలుత ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్‌రావు, రాజాసింగ్.. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులును కలిసి హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని అందించారు. తర్వాత సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డిని కలిశారు. కోర్టు సూచనలు, తమ అభ్యర్థనను సభాపతి తిరస్కరించారని ఈటల తెలిపారు. అనంతరం స్పీకర్​ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తిరిగి వెళ్లిన భాజపా ఎమ్మెల్యేలు.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.

అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు... సభ నిర్వహణకు అడ్డుతగులుతున్నారంటూ భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్‌రావు, రాజాసింగ్​ను సభ నుంచి సస్పెండ్​ చేశారు. స్పీకర్​ నిర్ణయంపై భాజపా సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సింగిల్​ జడ్జి సస్పెన్షన్​పై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులుపై​ భాజపా సభ్యులు మరోసారి అప్పీలు చేశారు. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు.. దీనిపై స్పీకర్ సరైన​ నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించింది. ఇవాళ ఉదయం శాసన సభ స్పీకర్​ను కలవాలని సూచించింది. భాజపా సభ్యులు స్పీకర్​ను కలిపించాలని.. శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. నేటితో శాసనసభ బడ్జెట్​ సమావేశాలు ముగియనున్నాయి.

ఇదీచూడండి: BJP MLAs About Suspension : 'ఈటల ముఖం చూడకూడదనే సభనుంచి పంపారు'

10:15 March 15

కోర్టు సూచనలు, మా అభ్యర్థనను సభాపతి తిరస్కరించారు: ఈటల రాజేందర్​

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సస్పెండైన భాజపా ఎమ్మెల్యేలు.. హైకోర్టు సూచనతో ఇవాళ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. తొలుత ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్‌రావు, రాజాసింగ్.. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులును కలిసి హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని అందించారు. తర్వాత సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డిని కలిశారు. కోర్టు సూచనలు, తమ అభ్యర్థనను సభాపతి తిరస్కరించారని ఈటల తెలిపారు. అనంతరం స్పీకర్​ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తిరిగి వెళ్లిన భాజపా ఎమ్మెల్యేలు.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.

అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు... సభ నిర్వహణకు అడ్డుతగులుతున్నారంటూ భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్‌రావు, రాజాసింగ్​ను సభ నుంచి సస్పెండ్​ చేశారు. స్పీకర్​ నిర్ణయంపై భాజపా సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సింగిల్​ జడ్జి సస్పెన్షన్​పై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులుపై​ భాజపా సభ్యులు మరోసారి అప్పీలు చేశారు. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు.. దీనిపై స్పీకర్ సరైన​ నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించింది. ఇవాళ ఉదయం శాసన సభ స్పీకర్​ను కలవాలని సూచించింది. భాజపా సభ్యులు స్పీకర్​ను కలిపించాలని.. శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. నేటితో శాసనసభ బడ్జెట్​ సమావేశాలు ముగియనున్నాయి.

ఇదీచూడండి: BJP MLAs About Suspension : 'ఈటల ముఖం చూడకూడదనే సభనుంచి పంపారు'

Last Updated : Mar 15, 2022, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.