ETV Bharat / city

Telangana Assembly Sessions 2021 : నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగింపు!

author img

By

Published : Oct 8, 2021, 8:30 AM IST

Updated : Oct 8, 2021, 9:33 AM IST

శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Sessions 2021) నేటితో ముగియనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నేటి సభలో.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇవాళ అన్ని బిల్లులకు ఆమోదం లభించనుంది. ముఖ్యమైన అంశాలపై చర్చలు పూర్తవనున్నాయి.

Telangana Assembly Sessions 2021
Telangana Assembly Sessions 2021

శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Sessions 2021) శుక్రవారం ముగియనున్నాయి. శాసనసభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీసీల కులగణన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని పక్షాల మద్దతు కోరనున్నారని తెలుస్తోంది. మండలిలో పల్లె, పట్టణ ప్రగతి అంశంతోపాటు స్టాంపుల చట్టం సవరణ బిల్లుపై చర్చించనున్నారు. శుక్రవారం నాటికి అన్ని బిల్లులకు ఆమోదం లభించనుండటంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చలు పూర్తవుతున్నందున సమావేశాలను ముగించనున్నారు. దీనిపై శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌లు శాసనసభాపక్ష నేతలతో గురువారం చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మండలిలో వీటిపై చర్చ

పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై మండలి(Telangana Legislative Council)లో చర్చ జరగనుంది. సౌర-పవన విద్యుత్, పత్తి సేకరణ, భారీ వర్షాలతో పంటనష్టం, ఎస్టీలుగా వాల్మీకీలు, రాష్ట్ర వృద్ధిపై నీతిఆయోగ్ ప్రశంస అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విధానం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం, ఎఫ్​సీఐ ద్వారా బియ్యం కొనుగోళ్లు, పట్టణ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం అంశాలు మండలిలో(Telangana Legislative Council) ప్రశ్నోత్తరాల్లో చర్చించనున్నారు. స్టాంపుచట్టం సవరణ బిల్లుపై కౌన్సిల్​(Telangana Legislative Council)లో ఇవాళ చర్చ జరగనుంది. ఇవాళ్టితో వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. సమావేశాల ముగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉభయసభలను ఇవాళ నిరవధికంగా వాయిదా వేయవచ్చని సమాచారం.

అసెంబ్లీలో పీవీ చిత్రపటం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం శాసనసభ(Telangana Assembly Sessions 2021)లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావు, ఇతర కుటుంబసభ్యులు పాల్గొంటారు. శాసనసభ కింది అంతస్తులోని సభ్యుల మందిరంలో ఏర్పాటు చేసిన పీవీ చిత్రపటాన్ని గురువారం సీఎం కేసీఆర్‌, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.

విజయ డెయిరీ, జీసీసీ ఉత్పత్తుల పంపిణీ

శాసనసభ, మండలి సభ్యులకు(Telangana Assembly Sessions 2021) విజయ డెయిరీ, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉత్పత్తులను గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతి రాథోడ్‌లు పంపిణీ చేశారు. శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌లకు సైతం వాటిని అందజేశారు

శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Sessions 2021) శుక్రవారం ముగియనున్నాయి. శాసనసభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీసీల కులగణన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని పక్షాల మద్దతు కోరనున్నారని తెలుస్తోంది. మండలిలో పల్లె, పట్టణ ప్రగతి అంశంతోపాటు స్టాంపుల చట్టం సవరణ బిల్లుపై చర్చించనున్నారు. శుక్రవారం నాటికి అన్ని బిల్లులకు ఆమోదం లభించనుండటంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చలు పూర్తవుతున్నందున సమావేశాలను ముగించనున్నారు. దీనిపై శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌లు శాసనసభాపక్ష నేతలతో గురువారం చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మండలిలో వీటిపై చర్చ

పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై మండలి(Telangana Legislative Council)లో చర్చ జరగనుంది. సౌర-పవన విద్యుత్, పత్తి సేకరణ, భారీ వర్షాలతో పంటనష్టం, ఎస్టీలుగా వాల్మీకీలు, రాష్ట్ర వృద్ధిపై నీతిఆయోగ్ ప్రశంస అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విధానం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం, ఎఫ్​సీఐ ద్వారా బియ్యం కొనుగోళ్లు, పట్టణ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం అంశాలు మండలిలో(Telangana Legislative Council) ప్రశ్నోత్తరాల్లో చర్చించనున్నారు. స్టాంపుచట్టం సవరణ బిల్లుపై కౌన్సిల్​(Telangana Legislative Council)లో ఇవాళ చర్చ జరగనుంది. ఇవాళ్టితో వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. సమావేశాల ముగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉభయసభలను ఇవాళ నిరవధికంగా వాయిదా వేయవచ్చని సమాచారం.

అసెంబ్లీలో పీవీ చిత్రపటం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం శాసనసభ(Telangana Assembly Sessions 2021)లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావు, ఇతర కుటుంబసభ్యులు పాల్గొంటారు. శాసనసభ కింది అంతస్తులోని సభ్యుల మందిరంలో ఏర్పాటు చేసిన పీవీ చిత్రపటాన్ని గురువారం సీఎం కేసీఆర్‌, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.

విజయ డెయిరీ, జీసీసీ ఉత్పత్తుల పంపిణీ

శాసనసభ, మండలి సభ్యులకు(Telangana Assembly Sessions 2021) విజయ డెయిరీ, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉత్పత్తులను గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతి రాథోడ్‌లు పంపిణీ చేశారు. శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌లకు సైతం వాటిని అందజేశారు

Last Updated : Oct 8, 2021, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.