ETV Bharat / city

ఉద్యమాన్ని లాఠీలతో అణచివెయ్యలేరు: లోకేశ్

author img

By

Published : Jan 20, 2020, 9:48 AM IST

అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం గొప్పదైతే... ఎందుకు భయపడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు.

lokesh
lokesh

ఏపీ రాజధాని విభజన నిర్ణయం గొప్పదైతే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతి విభజన నిర్ణయం అద్భుతమంటూ వైకాపా నాయకులు డప్పు కొడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పేంటని.. ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని పోలీసు లాఠీలు, ముళ్ల కంచెలతో అణచివేయడం సాధ్యంకాదన్నారు. ఎంత తొక్కాలి అనుకుంటే అంతకు పదింతలు ఉద్యమం ఉద్ధృతమవుతుందన్నారు.

lokesh tweets
లోకేశ్ ట్వీట్

ఇదీ చదవండి: ఏపీలో తెదేపా నేతల గృహ నిర్బంధం

ఏపీ రాజధాని విభజన నిర్ణయం గొప్పదైతే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతి విభజన నిర్ణయం అద్భుతమంటూ వైకాపా నాయకులు డప్పు కొడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పేంటని.. ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని పోలీసు లాఠీలు, ముళ్ల కంచెలతో అణచివేయడం సాధ్యంకాదన్నారు. ఎంత తొక్కాలి అనుకుంటే అంతకు పదింతలు ఉద్యమం ఉద్ధృతమవుతుందన్నారు.

lokesh tweets
లోకేశ్ ట్వీట్

ఇదీ చదవండి: ఏపీలో తెదేపా నేతల గృహ నిర్బంధం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.