వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. హోల్సేల్ వ్యాపారి 250 క్వింటాళ్లు, రిటైలర్ 20 క్వింటాళ్ల ఉల్లి నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
దిగుమతి చేసుకునే వ్యాపారులకు మినహాయింపు ఇచ్చింది. అందుకు అనుగుణంగా గతంలో జారీ చేసిన ఉల్లి వ్యాపారుల అనుమతులు, నిల్వ, నియంత్రణ ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: 'బెండకాయ తొక్కు పచ్చడి' చేసుకోండిలా..