ETV Bharat / city

చేపల దిగుబడి పెంచేసి... బంగారు బహుమతి కొట్టేసి!

ప్రకృతి పచ్చగా ఉంటే మానవ జీవితం హాయిగా సాగిపోతుంది... అదే ప్రకృతి గాయపడితే? ఆ ప్రభావం మన ఉపాధిపైనా పడుతుంది. దశాబ్దాలుగా కలుషితమైన నీటి వనరులని కాపాడితేకానీ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండవని అర్థం చేసుకుంది స్నేహల్‌వర్మ. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని తోడు తీసుకుని తెలుగు రాష్ట్రాల మహిళా మత్స్యకారులకు అండగా నిలిచింది. ఆ సేవలకుగాను ప్రతిష్ఠాత్మక ‘ఐఐటీ దిల్లీ గోల్డ్‌ ఎక్సలెన్స్‌’ అవార్డుని అందుకుంది.

author img

By

Published : Aug 2, 2020, 7:37 AM IST

shnehavarma
shnehavarma

చిన్నప్పటి నుంచీ భారత వైమానిక దళంలో చేరాలని కలలు కనేది స్నేహల్‌వర్మ. బీటెక్‌ పూర్తయ్యేనాటికి ఆమె మనసు మార్చుకుంది. కారణం రోజురోజుకీ తరిగిపోతున్న ప్రకృతి వనరులే! పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా ఎంబీఏ పూర్తి చేసింది. మంచినీటి వనరులను కాపాడాలన్న తపనతో ‘నేచర్‌ డాట్స్‌’ అనే అంకుర సంస్థను స్థాపించింది. ఈ కరోనా కల్లోల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా మత్స్యకారులకు చేపల దిగుబడి, ఎగుమతుల విషయంలో అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగుపూలు పూయించిందీ సంస్థ.

బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్

స్నేహల్‌వర్మ తండ్రి కేంద్ర రెవెన్యూ సర్వీసెస్‌ ఆఫీసర్‌ కావడంతో ఆయనతోపాటే వారి కుటుంబం కూడా దేశమంతటా తిరగాల్సి వచ్చేది. అలా స్నేహల్‌ చదువు ఒక చోట సాగలేదు. ఇండోర్‌లోని రాజీవ్‌గాంధీ ప్రొద్యోగికి విశ్వవిద్యాలయంలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన స్నేహల్‌ భోపాల్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ సంస్థలో ప్రోగ్రాం డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నదులు, మాగాణి భూములు, నదీజలాలకు సంబంధించి చట్టపరమైన అంశాలపై పనిచేసిన అనుభవాన్ని సంపాదించుకుంది. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఓ పర్యావరణ పరిరక్షణ సంస్థకు సలహాదారుగానూ పని చేసింది.

సాంకేతిక సాయం అండగా...

ఈ అనుభవంతోనే నేచర్‌ డాట్స్‌ అనే అంకుర సంస్థకు శ్రీకారం చుట్టింది. పర్యావరణం, నీటి వనరులను కాపాడేందుకు సాంకేతికతను అభివృద్ధి చేసి తద్వారా ఉపాధి అవకాశాలని పెంచడమే ఈ సంస్థ లక్ష్యం. నేచర్‌ డాట్స్‌... మొదట ఛత్తీస్‌గఢ్‌, ఝూర్ఖండ్‌లోని మత్స్యకారులతో కలిసి పనిచేసింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నీటివనరుల్లో పేరుకున్న మురికిని, కాలుష్యాన్ని తొలగించి మంచినీటి నాణ్యతను, చేపల దిగుబడినీ పెంచే దిశగా అడుగులు వేసింది స్నేహల్‌వర్మ. ఎప్పటికప్పుడు మత్స్య కారులకు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపింది.

లాక్‌డౌన్ సవాల్‌గా నిలిచింది

‘లాక్‌డౌన్‌ సమయంలో మత్స్యకారులంతా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి సమయంలో చేపల దిగుబడి, వాటిని ఎగుమతి చేయడం వంటివన్నీ వారి ముందు సవాళ్లుగా నిలిచాయి. ఛత్తీస్‌గఢ్‌ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, తెలంగాణలోని నల్గొండ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం దొరికింది. ‘ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చెరువుల్లో నీటి నాణ్యతను 75 శాతం పెంచాం. జలాల స్వచ్ఛత పెరిగిన తర్వాత చేపల దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇక ఎగుమతి విషయంలో కూడా వ్యాపారులకు మేమిచ్చిన సూచనలు చక్కని ఫలితాలు ఇచ్చాయి. అలాగే ఈ రంగంలో మహిళల సంఖ్య మరింత పెరగాలి..’ అనే స్నేహల్‌ పేదమహిళల అభివృద్ధి కోసం యూఎన్‌ఉమెన్‌, హెల్పేజ్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

మహిళలకు చేయూత

పేద మహిళలకు చేయూతగా నిలిచే మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ఐఐటీ దిల్లీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలు సంయుక్తంగా ఈ ఏడాది ‘ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌(డబ్ల్యూఈఈ)’ అవార్డుని మూడు విభాగాల్లో అందించాయి. వీరికి 25 లక్షల రూపాయల నగదు బహుమతినీ అందించాయి. వీటిలో గోల్డెన్‌ అవార్డు విభాగంలో ఎంపికై బహుమతి గెలుచుకుంది స్నేహల్‌వర్మ.

ఇదీ చదవండి: బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

చిన్నప్పటి నుంచీ భారత వైమానిక దళంలో చేరాలని కలలు కనేది స్నేహల్‌వర్మ. బీటెక్‌ పూర్తయ్యేనాటికి ఆమె మనసు మార్చుకుంది. కారణం రోజురోజుకీ తరిగిపోతున్న ప్రకృతి వనరులే! పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా ఎంబీఏ పూర్తి చేసింది. మంచినీటి వనరులను కాపాడాలన్న తపనతో ‘నేచర్‌ డాట్స్‌’ అనే అంకుర సంస్థను స్థాపించింది. ఈ కరోనా కల్లోల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా మత్స్యకారులకు చేపల దిగుబడి, ఎగుమతుల విషయంలో అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగుపూలు పూయించిందీ సంస్థ.

బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్

స్నేహల్‌వర్మ తండ్రి కేంద్ర రెవెన్యూ సర్వీసెస్‌ ఆఫీసర్‌ కావడంతో ఆయనతోపాటే వారి కుటుంబం కూడా దేశమంతటా తిరగాల్సి వచ్చేది. అలా స్నేహల్‌ చదువు ఒక చోట సాగలేదు. ఇండోర్‌లోని రాజీవ్‌గాంధీ ప్రొద్యోగికి విశ్వవిద్యాలయంలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన స్నేహల్‌ భోపాల్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ సంస్థలో ప్రోగ్రాం డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నదులు, మాగాణి భూములు, నదీజలాలకు సంబంధించి చట్టపరమైన అంశాలపై పనిచేసిన అనుభవాన్ని సంపాదించుకుంది. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఓ పర్యావరణ పరిరక్షణ సంస్థకు సలహాదారుగానూ పని చేసింది.

సాంకేతిక సాయం అండగా...

ఈ అనుభవంతోనే నేచర్‌ డాట్స్‌ అనే అంకుర సంస్థకు శ్రీకారం చుట్టింది. పర్యావరణం, నీటి వనరులను కాపాడేందుకు సాంకేతికతను అభివృద్ధి చేసి తద్వారా ఉపాధి అవకాశాలని పెంచడమే ఈ సంస్థ లక్ష్యం. నేచర్‌ డాట్స్‌... మొదట ఛత్తీస్‌గఢ్‌, ఝూర్ఖండ్‌లోని మత్స్యకారులతో కలిసి పనిచేసింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నీటివనరుల్లో పేరుకున్న మురికిని, కాలుష్యాన్ని తొలగించి మంచినీటి నాణ్యతను, చేపల దిగుబడినీ పెంచే దిశగా అడుగులు వేసింది స్నేహల్‌వర్మ. ఎప్పటికప్పుడు మత్స్య కారులకు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపింది.

లాక్‌డౌన్ సవాల్‌గా నిలిచింది

‘లాక్‌డౌన్‌ సమయంలో మత్స్యకారులంతా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి సమయంలో చేపల దిగుబడి, వాటిని ఎగుమతి చేయడం వంటివన్నీ వారి ముందు సవాళ్లుగా నిలిచాయి. ఛత్తీస్‌గఢ్‌ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, తెలంగాణలోని నల్గొండ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం దొరికింది. ‘ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చెరువుల్లో నీటి నాణ్యతను 75 శాతం పెంచాం. జలాల స్వచ్ఛత పెరిగిన తర్వాత చేపల దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇక ఎగుమతి విషయంలో కూడా వ్యాపారులకు మేమిచ్చిన సూచనలు చక్కని ఫలితాలు ఇచ్చాయి. అలాగే ఈ రంగంలో మహిళల సంఖ్య మరింత పెరగాలి..’ అనే స్నేహల్‌ పేదమహిళల అభివృద్ధి కోసం యూఎన్‌ఉమెన్‌, హెల్పేజ్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

మహిళలకు చేయూత

పేద మహిళలకు చేయూతగా నిలిచే మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ఐఐటీ దిల్లీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలు సంయుక్తంగా ఈ ఏడాది ‘ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌(డబ్ల్యూఈఈ)’ అవార్డుని మూడు విభాగాల్లో అందించాయి. వీరికి 25 లక్షల రూపాయల నగదు బహుమతినీ అందించాయి. వీటిలో గోల్డెన్‌ అవార్డు విభాగంలో ఎంపికై బహుమతి గెలుచుకుంది స్నేహల్‌వర్మ.

ఇదీ చదవండి: బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.