ETV Bharat / city

కార్తికమాసం: గోమాతకు సీమంతం

author img

By

Published : Dec 3, 2020, 10:20 PM IST

సంక్రాంతి, దసరా పండుగలొస్తేనే గోమాతకు పూజలు చేయటం సాధారణం. కార్తికమాసాల్లో ఆవుకు ప్రత్యేక పూజలు చేయటం మంచిదంటున్నారు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మహిళలు. వారు ఆవుకు ప్రత్యేక పూజలు చేసి.. పిండివంటలు తినిపించారు.

seemantha-pujas-for-cow-in-west-godavari-district-gilugumilli
కార్తికమాసం: గోమాతకు సీమంతం

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో గోమాతకు సీమంతం నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో గోవుకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు హరికృష్ణ మహిళల ఆధ్వర్యంలో పిండివంటలు ఏర్పాటు చేసి ఆవుకు తినిపించారు.

కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లును ఆలయ కమిటీ సభ్యుడు వ్యాస మూర్తి చేశారు. గోమాతకు సీమంతం నిర్వహించడం ద్వారా సమసమాజ స్థాపనకు శ్రీకారం చుట్టవచ్చన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో గోమాతకు సీమంతం నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో గోవుకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు హరికృష్ణ మహిళల ఆధ్వర్యంలో పిండివంటలు ఏర్పాటు చేసి ఆవుకు తినిపించారు.

కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లును ఆలయ కమిటీ సభ్యుడు వ్యాస మూర్తి చేశారు. గోమాతకు సీమంతం నిర్వహించడం ద్వారా సమసమాజ స్థాపనకు శ్రీకారం చుట్టవచ్చన్నారు.

ఇవీ చదవండి: లక్ష పసుపు కొమ్ములతో మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక అలంకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.