ETV Bharat / city

రెండోరోజూ డిపోలకు వస్తున్న కార్మికులు... అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

author img

By

Published : Nov 27, 2019, 10:19 AM IST

Updated : Nov 27, 2019, 10:34 AM IST

రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు రెండో రోజు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. డిపోల వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది ఐడీ కార్డులు పరిశీలించాకే విధుల్లోకి అనుమతిస్తున్నారు.

tsrtc strike
tsrtc strike

సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తాత్కాలిక సిబ్బంది ఐడీ కార్డులు పరిశీలించాకే విధుల్లోకి అనుమతిస్తున్నారు. ప్రత్యామ్నాయ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.

సికింద్రాబాద్​ హకీంపేట్ డిపో వద్ద విధులకు హాజరయ్యేందుకు వచ్చిన 15 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్​కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లో చేర్చుకునేందుకు ప్రభుత్వం నిరాకరించడం సరైన చర్య కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హకీంపేట్ డిపో వద్ద పెద్దఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంట్లో నుంచి...

ఖమ్మం డిపో వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ మహిళా కార్మికులు ఇంట్లో సమావేశమైన ఐదుగురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుర్హన్​పురంలో విధుల్లో చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు మధ్యలోనే అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.

డిపో ముందు ఆందోళనలు

నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద తమను విధుల్లోకి తీసుకోవాలంటూ.... డిపో మేనేజర్​తో కార్మికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... డిపో ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పిల్లల స్కూల్​ ఫీజు కూడా కట్టలేక పోతున్నామంటూ మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్​లో పటిష్ఠ భద్రత

వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వరంగల్ 1, వరంగల్ 2 డిపోతో పాటు హన్మకొండ బస్ డిపో వద్ద పోలీసులు తెల్లవారుజాము మొహరించి.. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కార్మికులు డిపోల వద్దకు రాకపోవడంతో హన్మకొండ బస్ ప్రాగంణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

డిపోలకు వస్తున్న ఆర్టీసీ కార్మికులు... అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

ఇదీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తాత్కాలిక సిబ్బంది ఐడీ కార్డులు పరిశీలించాకే విధుల్లోకి అనుమతిస్తున్నారు. ప్రత్యామ్నాయ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.

సికింద్రాబాద్​ హకీంపేట్ డిపో వద్ద విధులకు హాజరయ్యేందుకు వచ్చిన 15 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్​కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లో చేర్చుకునేందుకు ప్రభుత్వం నిరాకరించడం సరైన చర్య కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హకీంపేట్ డిపో వద్ద పెద్దఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంట్లో నుంచి...

ఖమ్మం డిపో వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ మహిళా కార్మికులు ఇంట్లో సమావేశమైన ఐదుగురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుర్హన్​పురంలో విధుల్లో చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు మధ్యలోనే అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.

డిపో ముందు ఆందోళనలు

నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద తమను విధుల్లోకి తీసుకోవాలంటూ.... డిపో మేనేజర్​తో కార్మికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... డిపో ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పిల్లల స్కూల్​ ఫీజు కూడా కట్టలేక పోతున్నామంటూ మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్​లో పటిష్ఠ భద్రత

వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వరంగల్ 1, వరంగల్ 2 డిపోతో పాటు హన్మకొండ బస్ డిపో వద్ద పోలీసులు తెల్లవారుజాము మొహరించి.. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కార్మికులు డిపోల వద్దకు రాకపోవడంతో హన్మకొండ బస్ ప్రాగంణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

డిపోలకు వస్తున్న ఆర్టీసీ కార్మికులు... అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

ఇదీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

Intro:సికింద్రాబాద్ యాంకర్.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు..హకీంపేట్ డిపో వద్ద నిన్నటి లాగే విధులకు హాజరయ్యేందుకు వచ్చిన 15 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్ కి తరలించారు..ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన ప్రభుత్వం దిగి రాక పోవడం వారిని విధుల్లో చేర్చుకునేందుకు నిరాకరించడం సరైన చర్య కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..హకీంపేట్ డిపో వద్ద పెద్దఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల వివక్ష చూపడం సహేతుకమైన చర్య కాదని మానవతా దృక్పథంతో సమ్మె విరమించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు.. Body:VamshiConclusion:7032401099
Last Updated : Nov 27, 2019, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.