పారిశుద్ధ్య కార్మికులు సమాజం కోసం ఎంతో కష్టపడుతున్నారని కొనియాడారు రాచకొండ సీపీ మహేశ్భగవత్. లాక్డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు.. ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్మికులు రాత్రనకా, పగలనకా నిత్యం కష్టపడుతున్నారని సీపీ పేర్కొన్నారు. కొవిడ్- 19ను నివారించాలంటే ప్రతిఒక్కరూ.. మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలని కోరారు.
ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన