ETV Bharat / city

Private Teacher Protest: ఓ ప్రైవేటు ఉపాధ్యాయుని ఆవేదన.. వినూత్న రీతిలో నిరసన - private teacher protest

Private Teacher Protest: పాఠశాలల సెలవుల పొడిగింపుపై ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు.. మళ్లీ ఈ సెలవుల వల్ల తామే కాకుండా విద్యార్థులు కూడా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవుల పొడిగింపును ఖండిస్తూ.. ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు వ్యక్తం చేసిని నిరసన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

private teacher protest against holidays Extension for schools in telangana
private teacher protest against holidays Extension for schools in telangana
author img

By

Published : Jan 19, 2022, 10:27 PM IST

ఓ ప్రైవేటు ఉపాధ్యాయుని ఆవేదన.. వినూత్న రీతిలో నిరసన

Private Teacher Protest:కరోనా కారణంగా పాఠశాలలకు సెలవుల పొడిగింపును ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు తీవ్రంగా ఖండించాడు. కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. దీనిపై కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన నర్సింహులు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ప్రధాన రహదారిపై చాక్​పీస్​తో.. వైన్​షాపులో లేని కరోనా.. పర్మిట్ రూముల్లో లేని కరోనా.. సదస్సులకు లేని కరోనా.. బడిలోనే ఉందా..? సరస్వతి ఒడిలోనే ఉందా..? అంటూ రాసి తన ఆవేదన వెళ్లగక్కాడు. ఈ నిరసన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ ఉపాధ్యాయుని మాటల్లోని ఆవేదన.. నిజమే అని కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మద్దతు తెలుపుతున్నారు.

ఆ ప్రైవేటు ఉపాధ్యాయుని మాటల్లోని ఆవేదన..

"సంక్రాంతి వరకు సెలవులిచ్చిన ప్రభుత్వం ఆపై వాటిని పొడిగించటాన్ని ఓ ప్రైవేటు ఉపాధ్యాయునిగా ఖండిస్తున్నాను. అయ్యా కేసీఆర్​.. కరోనా వ్యాప్తి చెందుతుందంటున్నారు. బాగానే ఉంది. అయితే కేవలం బడిలోనే అది వ్యాప్తి చెందుతుందా..? వైన్​షాపుల దగ్గర, పర్మిట్​ రూమ్​లలో, సినిమా హాళ్లలో, సదస్సుల్లో ఎలాంటి నిబంధనలు లేవ్వు కదా.. ఈ ప్రదేశాల్లో లేని కరోనా.. కేవలం బడిలోనే ఉందా..? సరస్వతి ఒడిలోనే ఉందా..? చెప్పాలి. ఇప్పటికైనా.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం కేసీఆర్​.. ఈ సెలవుల అంశంపై, విద్యార్థుల భవిష్యత్తుపై పునరాలోచించి వీలైనంత తొందరగా పాఠశాలలను పునఃప్రారంభించాలని ఓ ప్రైవేటు ఉపాధ్యాయునిగా నా విన్నపం."

- నర్సింహులు, ప్రైవేటు ఉపాధ్యాయుడు

ఇదీ చూడండి:

ఓ ప్రైవేటు ఉపాధ్యాయుని ఆవేదన.. వినూత్న రీతిలో నిరసన

Private Teacher Protest:కరోనా కారణంగా పాఠశాలలకు సెలవుల పొడిగింపును ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు తీవ్రంగా ఖండించాడు. కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. దీనిపై కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన నర్సింహులు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ప్రధాన రహదారిపై చాక్​పీస్​తో.. వైన్​షాపులో లేని కరోనా.. పర్మిట్ రూముల్లో లేని కరోనా.. సదస్సులకు లేని కరోనా.. బడిలోనే ఉందా..? సరస్వతి ఒడిలోనే ఉందా..? అంటూ రాసి తన ఆవేదన వెళ్లగక్కాడు. ఈ నిరసన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ ఉపాధ్యాయుని మాటల్లోని ఆవేదన.. నిజమే అని కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మద్దతు తెలుపుతున్నారు.

ఆ ప్రైవేటు ఉపాధ్యాయుని మాటల్లోని ఆవేదన..

"సంక్రాంతి వరకు సెలవులిచ్చిన ప్రభుత్వం ఆపై వాటిని పొడిగించటాన్ని ఓ ప్రైవేటు ఉపాధ్యాయునిగా ఖండిస్తున్నాను. అయ్యా కేసీఆర్​.. కరోనా వ్యాప్తి చెందుతుందంటున్నారు. బాగానే ఉంది. అయితే కేవలం బడిలోనే అది వ్యాప్తి చెందుతుందా..? వైన్​షాపుల దగ్గర, పర్మిట్​ రూమ్​లలో, సినిమా హాళ్లలో, సదస్సుల్లో ఎలాంటి నిబంధనలు లేవ్వు కదా.. ఈ ప్రదేశాల్లో లేని కరోనా.. కేవలం బడిలోనే ఉందా..? సరస్వతి ఒడిలోనే ఉందా..? చెప్పాలి. ఇప్పటికైనా.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం కేసీఆర్​.. ఈ సెలవుల అంశంపై, విద్యార్థుల భవిష్యత్తుపై పునరాలోచించి వీలైనంత తొందరగా పాఠశాలలను పునఃప్రారంభించాలని ఓ ప్రైవేటు ఉపాధ్యాయునిగా నా విన్నపం."

- నర్సింహులు, ప్రైవేటు ఉపాధ్యాయుడు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.